Movies

నాడు వాళ్ళను ఆదుకున్నాడు … నేడు దీనస్థితిలో ఉన్నాడు ఆ కమెడియన్…. ఎవరో చూడండి

తెలుగు సినిమాలో వింతలూ విశేషాలు ఎన్నో ఉంటాయి. ఇదో మాయా ప్రపంచం. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటే ఏమిటో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఎందరికో ఆశ్రయం ఇస్తూ,వాళ్ళను ఆదుకున్న వాళ్ళు తర్వాత కాలంలో దీనస్థితికి చేరడం విచారకరం. ఇక తమకు చేయూతనందించిన వాళ్ళ గురించి ఏమాత్రం చెప్పకుండా దాచేసేవాళ్ళూ ఉంటారు. ఇక మనం చెప్పబోయే గొప్ప స్టార్స్ లో ఒకరు సినిమాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రెండో వ్యక్తి కమెడియన్ సునీల్. వీళ్ళిద్దరూ భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీలో మంచి మిత్రులు. ఆతర్వాత ఇద్దరూ సినిమా ఫీల్డ్ కి వచ్చి స్థిరపడ్డారు. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. సునీల్ స్టార్ కమెడియన్ గా, హీగా రాణిస్తున్నాడు.

వీళ్లిద్దరు సినిమా ఛాన్స్ ల కోసం హైదరాబద్ వచ్చి,ఒకే రూమ్ లో , ఒకే టీ,ఒకే బన్ను చెరిసగం పంచుకుని బతికారు. తర్వాత వీరికి అదృష్టం కల్సి వచ్చి, మంచి స్థితికి వచ్చారు. అయితే వీళ్ళద్దిరికీ మొదట్లో చేయూతనిచ్చిన వ్యక్తి మాత్రం ఇప్పుడు దీనంగా తన కొడుకు భవితకోసం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి గురించి త్రివిక్రమ్,సునీల్ ఎక్కడా కూడా అతడి పేరు చెప్పకపోవడం విశేషం.

సినిమాల్లో వాళ్ళ రేంజ్ అలాంటింది. పోసాని కృష్ణ మురళీ దగ్గర అసిస్టెంట్ గా చేసి, రైటర్ గా,డైరెక్టర్ గా ఎలా ఎదిగాడో త్రివిక్రమ్ చెబుతాడు. అలాగే కమెడియన్ గా , హీరోగా ఎలా ఎదిగానో సునీల్ వివరిస్తాడు. కానీ ప్రస్తుతం దీనస్థితిలో కొట్టుమిట్టాడే వ్యక్తి ప్రముఖ కమెడియన్ గౌతమ్ రాజు గురించి మాత్రం ప్రస్తావించరు. త్రివిక్రమ్ శ్రీనివాస్,సునీల్ లకు ఒకప్పుడు పూటగడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో నిలబడడానికి చేయూతనిచ్చిన వ్యక్తి కమెడియన్ గౌతమ్ రాజ్.

సినిమా వాళ్ళు ఎవరూ తెలియక పోవడంతో మొదట్లో గౌతమ్ రాజు పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టిన వీళ్ళిద్దరూ, ఆతర్వాత గౌతమ్ రాజు ఇంటికి వచ్చే సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకున్నారు. ట్యూషన్స్ పేరిట డబ్బులిచ్చి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి గౌతమ్ రాజు. అలా గౌతమ్ రాజు ఇంటికి రావడం వలన సినీ పరిచయాలు పెరిగి డైరెక్టర్ తేజ దగ్గర ఛాన్స్ సంపాదించి సునీల్ మంచి కమెడియన్ స్టార్ అయ్యాడు.

ఇక అదేసమయంలో పోసాని దగ్గర త్రివిక్రమ్ అసిస్టెంట్ గా చేరాడు. స్వయంవరం,చిరునవ్వుతో మూవీలకు మాటలు రాసిన త్రివిక్రమ్ కి అవి సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఇక నువ్వే నువ్వే మూవీకి డైరెక్షన్ చేసాడు. ఇక వీళ్లిద్దరి సినీ ప్రయాణం హుషారుగా సాగుతుంటే గౌతమ్ రాజు స్థితి అందుకు భిన్నంగా ఉంది. కొడుకు చిరంజీవి కృష్ణంరాజుని హీరోగా చేయడానికి, సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం సొంతంగా సినిమా తీస్తూ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.

దొరికినకాడికల్లా అప్పులు చేస్తూ,సినిమా విడుదలకు శ్రమిస్తున్నాడు. సినిమా విడుదలయినా ఆడుతుందో లేదో తెలీదు. మరి ఇలాంటి సమయంలో త్రివిక్రమ్,సునీల్ సహకరిస్తే బావుంటుందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే తనవల్ల వాళ్లిద్దరూ నిలబడ్డారని గౌతమ్ రాజు కూడా ఎక్కడా చెప్పలేదు. అందుకే ఆదుకునే సమయంలో స్పందిస్తే మంచిదన్న మాట నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.