Movies

సినిమాల్లో బిజీగా మారుతున్న అనసూయ… మరి బుల్లితెర పరిస్థితి ఏమిటో…?

ఇప్పటివరకు బుల్లి తెర యాంకర్ గా విశేష ఆదరణ సంపాదించుకున్న అనసూయ, సినిమాల్లో తనదైన శైలి తో అదరగొడుతున్నారు. పాత్ర ఏదైనా, ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయడానికి చాల శ్రమిస్తున్నారు. క్షణం, రంగస్థలం చిత్రాలతో అద్భుతం నటన కనబరిచిన అనసూయ చిత్ర పరిశ్రమ లో గుర్తుండే పాత్రలకు పెద్ద పీఠ వేసేలా కథలని ఎంచుకుంటున్నారు. అయితే అనసూయ ఇపుడు సరికొత్తగా ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

అర్జున్ రెడ్డి చిత్రం తో టాలీవుడ్ మనసు దోచుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించారు. అయితే తాజాగా విజయ్ నిర్మించనున్న మరొక చిత్రంలో ప్రతినాయకురాలి పాత్ర కోసం విజయ్ అనసూయ ని సంప్రదించినట్లు సమాచారం. అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో నటిస్తున్న అనసూయ, పవన్- క్రిష్ కలయిక లో వస్తున్న pspk27 లో కూడా ఒక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."