లాక్డౌన్ ఎఫెక్ట్: ముఖేశ్ అంబానీకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా?
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా చాలా దేశాలు కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు లాక్డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో కూడా లాక్డౌన్ పాటిస్తుండడంతో దీని ప్రభావం సామాన్యుడి నుంచి ధనికుడి వరకు అందరిపై చూపుతుంది.
అయితే మన దేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా తన సంపదలో 28 శాతం కోల్పోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు చేరుకుందట. మార్చ్ 31నాటికి రోజుకి 300 మిలియన్ డాలర్ల సంపద కోల్పోయినట్టు పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా 19 బిలియన్ డాలర్ల మేర సంపద కోల్పోయి అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అంబానీ 8వ స్థానానికి పడిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితే చాలా మందికి ఎదురవ్వడంతో అనేక మంది తమ ర్యాంకింగ్స్ కోల్పోయి చతికిలపడ్డారు. అయితే ప్రస్తుతం భారత్ నుంచి ముకేశ్ అంబానీ మాత్రమే టాప్ 100 జాబితాలో నిలిచాడు.
