Movies

అప్పుడే “పుష్ప” శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బన్నీ మొట్ట మొదటిసారిగా తన పాన్ ఇండియన్ పేజ్ ను మొదలు పెట్టారు.

ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా మొదలు పెట్టేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ముందు బన్నీ నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం తాలూకా సాటిలైట్ హక్కులను దక్కించుకున్న జెమినీ టీవీ వారే ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ సినిమాకు కూడా భారీ ధరే పలికి ఉంటుంది.అలాగే అన్ని భాషల్లో కూడా సన్ నెట్వర్క్ వారే కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇంకా దీనికి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."