ఈ వారసుల ఎంట్రీ ఎప్పుడో తెలుసా?
Silver screen entry of star heroes kids
చిత్ర విచిత్రమైన సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో వింతలూ కూడా కనిపిస్తున్నాయి.
టాలెంట్ తో గానీ, యాక్టింగ్ తో గానీ పనిలేకుండా కేవలం బ్యాగ్రౌండ్ ఉంటే చాలు నట వారసులు అడుగుపెట్టేయవచ్చు.
ఒక్కరు ఇండస్ట్రీలో అడుగుపెడితే వారి నుండి యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళూ వస్తూనే ఉన్నారు.
ఇది మన ఒక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోనే కాదు బాలీవుడ్ నుంచి అన్ని భాషల్లో ఇదే తంతు నడుస్తోదని చెప్పాలి.
అయితే తెలుగులో మరీ ఎక్కువ కనిపిస్తోంది.
ముఖ్యంగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి డజను మంది, అక్కినేని ఫ్యామిలీ నుండి అర డజను మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేసారు.
అలానే నందమూరి ఫ్యామిలీ నుండి.. దగ్గుబాటి ఫ్యామిలీ.. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి కూడా టాలీవుడ్ కి నటీనటులు పరిచయమయ్యారు.
అయితే ఇందులో చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
అయితే ఒకరిద్దరు మాత్రం మొదటి సినిమాకే పరిమితం అయ్యారు.
నిజానికి సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.
వాటిని అందుకోవడంలో సక్సెసయిన వారు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
అయితే గత కొంతకాలంగా అందరి చూపు మెగా వారసుడు అకీరా.. ఘట్టమనేని వారసుడు గౌతమ్ కృష్ణ.. నందమూరి వారసుడు మోక్షజ్ఞ మీద బలంగా ఉంది.
వారి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో చూస్తున్నారు.
తన తనయుడు మోక్షజ్ఞ హీరోగా అడుగుపెడతాడని ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.
ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు మోక్షజ్ఞ కోసం స్టోరీస్ కూడా రెడీ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్.. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ లు ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడనే దానిపై ఫ్యాన్స్ లో ఆత్రుత కనిపిస్తోంది.
మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు.
ఇక వారి వారసులుగా వస్తున్నారంటే వారిపై ఇంకా ప్రెజర్ ఉంటుంది.. బాధ్యత ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ తనయుడు గౌతమ్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అభిమానులను పలకరించాడు.
ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన మహేష్.. గౌతమ్ ఎంట్రీ గురించి ఎంట్రీ ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుందని వెల్లడించాడు.
దీన్ని బట్టి స్టడీస్ మీద ఫోకస్ పెట్టిన గౌతమ్ సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా ఎంట్రీ ఇస్తాడని అర్థం అయిపోయింది.
పవన్ తనయుడు అకీరా నందన్ కూడా తల్లి రేణు దేశాయ్ దర్శకత్వం లో వచ్చిన మరాఠీ సినిమా ‘ఇష్క్ వాలా లవ్’లో నటించాడు.
అయితే ప్రస్తుతం అకీరా చదువు మీద ఫోకస్ పెట్టాడని రేణు దేశాయ్ చెప్పినా, పెద్దయ్యాక సినిమాల్లోకి వస్తాడా అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
అయితే అకీరా కూడా సినిమాల్లోకి వస్తే బాగుంటుందని మెగా ఫ్యామిలీ సభ్యులు, పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.
రెండు పెద్ద ఫ్యామిలీలనుంచి హీరోల ఎంట్రీ గురించి స్పష్టత రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.