Movies

మెగా హీరో రిజెక్ట్ చేసిన కథను మహేష్ ఒకే చేశాడా…?

Parasuram narrated sarkaru vari paata script to allu sirish

ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు 27వ సినిమా రెడీ అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ ‘సర్కారు వారి పాట’ గా ఖరారు చేస్తూ, లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ,సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణాన మహేశ్ 27 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనపై ఖుషీ అవుతున్నారు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

పరశురామ్ ఇదివరకు శ్రీరస్తు శుభమస్తు.. గీత గోవిందం లాంటి మంచి విజయాలను తన ఖాతాలో జమేసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో పరశురామ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు.

స్టార్ హీరోలు సైతం పరశు రామ్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ సమయంలో తాజాగా పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా మహేష్ ఓకే చేసాడు.

ప్రస్తుతం ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇస్తానన్నాడు పరశురామ్.

అయితే ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అయింది.

అదేమిటంటే, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అల్లు శిరీష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటిలో ఒక్కటి కూడా కమర్షియల్ గా హిట్ కొట్టలేకపోయాడు.

పరశురామ్ డైరెక్షన్లో `శ్రీరస్తు శుభమస్తు` చిత్రం చేసి, కాస్త పర్వాలేదనిపించుకున్నాడు.

అయితే ఈ మూవీ కంటే ముందు శిరీష్ కు పరుశురాం రెండు కథలు చెప్పాడట.. కానీ ఆ రెండు కథలు శిరీష్ కు నచ్చలేదట.

వాటిలో ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సర్కారు వారి పాట కూడా ఉందట. కానీ మహేష్ ఒకే చేసాడు.

ఇదే నిజమైతే శిరీష్ వదులుకున్న సినిమా మహేష్ కి సూపర్ హిట్ ఇస్తుందన్న టాక్ నడుస్తోంది.