Movies

మల్లేశ్వరి సినిమా కోసం కత్రినా కైఫ్ ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా?

వెంకటేష్ హీరోగా విజయ్భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మల్లేశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది ముఖ్యంగా వెంకటేష్ బ్రహ్మానందం కత్రినా కైఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా కామెడీని పండించాయి. మల్లీశ్వరి సినిమాతోనే టాలీవుడ్ కి కత్రినాకైఫ్ ఎంట్రీ ఇచ్చింది. కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాలో నటించే సమయానికి బాలీవుడ్లో కేవలం ఒకే ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం పారితోషికం భారీగానే ఇచ్చారట. ఆమెకు 70 లక్షల రూపాయల వరకు ఇచ్చారట.

అప్పట్లో ఇది అత్యధిక పారితోషికం. ఆ తర్వాత మరొక సినిమాలో నటించింది. అల్లరి పిడుగు సినిమా లో బాలకృష్ణతో ఆడిపాడింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగి పోయింది. ఇక తెలుగు సినిమాల జోలికి రాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."