ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా… ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా?
2018 లో వచ్చిన లవర్ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కేరళ బ్యూటీ రిద్ది కుమార్ నటించింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అయితే తర్వాత అవకాశాలను పట్టుకోవడంలో విఫలం అయ్యింది. లవర్ సినిమా తర్వాత అనగనగా ఓ ప్రేమ కథ సినిమాల్లో నటించింది.అయితే ఆ సినిమా ఎప్పుడు విడుదల అయిందో కూడా ఎవ్వరికీ తెలీదు.
ఆమె కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంగానే సినీ అవకాశాలు దక్కటం లేదని సినీ విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఆమె అభిమానులు ఇప్పటికైనా రిద్ది కుమార్ ప్రతిభను గుర్తించి టాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలనివ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

