ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా… ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా కొన్ని మూవీస్ కి సహ నిర్మాతగా వ్యవహరించిన దీక్షా సేథ్ ఇప్పుడు ఎక్కడ కనపడ్డం లేదు. ఇప్పుడంటే లాక్ డౌన్ కానీ, ఆమధ్య కూడా ఏ సినిమా ఫంక్షన్ లోనూ కన్పించిన దాఖలాలు లేవు. నిజానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన వేదం మూవీలో చేయడం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ఇలా వేదం మూవీలో చేయడం ద్వారా ఓ పక్క అనుష్క మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో కల్సి నటించిన క్రెడిట్ కొట్టేసింది. ఇక మాస్ మహారాజు రవితేజ హీరోగా చేసిన మిరపకాయ్ మూవీలో చేసిన దీక్షా సేథ్ ఆతర్వాత హీరో గోపిచంద్ నటించిన వాంటెడ్ మూవీలో కూడా హీరోయిన్ గా మెరిసింది.
ఆతర్వాత దీక్షా సేథ్ మళ్ళీ ఎక్కడా దర్శనం ఇవ్వలేదు. ఫస్ట్ మూవీ తోనే తేడా కొట్టడంతో ఈ అమ్మడికి ఛాన్స్ లు రాలేదనే చెప్పాలి. తర్వాత నటించిన సినిమాలు కూడా ఈమెకు అచ్చి రాలేదు. దాంతో టాలీవుడ్ కి దూరం అయింది. మరి ఇప్పుడు ఎక్కడ ఉందొ ఏమి చేస్తోందో .

