Pregnant Women:శుభవార్త: గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుంచి అకౌంట్లోకి నేరుగా రూ.11,000.. దరఖాస్తు చేసుకోండిలా!
Pregnant Women:శుభవార్త: గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుంచి అకౌంట్లోకి నేరుగా రూ.11,000.. దరఖాస్తు చేసుకోండిలా.. కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం మరియు పౌష్టికాహారం కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ (PMMVY). సరైన అవగాహన లేక చాలామంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు.
ఈ పథకం కింద అర్హులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రూ.11,000 వరకు నేరుగా జమవుతాయి. ఈ డబ్బు ఎలా వస్తుందో, ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా తెలుసుకోండి.
డబ్బులు ఖాతాలో ఎలా జమ అవుతాయంటే..ఈ పథకం ద్వారా లభించే ఆర్థిక సాయాన్ని రెండు దశల్లో అందిస్తారు:
1. మొదటి కాన్పుకు (రూ. 5,000):
మొదటి విడత: గర్భం దాల్చినట్లు రిజిస్ట్రేషన్ చేసుకోగానే రూ. 1,000.
రెండవ విడత: గర్భం దాల్చిన ఆరవ నెల తర్వాత రూ. 2,000.
మూడవ విడత: బిడ్డ పుట్టి, మొదటి వ్యాక్సినేషన్ (టీకా) పూర్తయిన తర్వాత రూ. 2,000.
2. రెండవ కాన్పుకు (రూ. 6,000):
రెండవసారి గర్భం దాల్చినప్పుడు బిడ్డ జన్మించి, అవసరమైన అన్ని పరీక్షలు, విధానాలు పూర్తయిన తర్వాత ఒకేసారి రూ. 6,000 మీ ఖాతాలో జమ అవుతాయి.
దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు
తల్లి ఆధార్ కార్డ్
బ్యాంక్ అకౌంట్ పాస్బుక్
ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ (గర్భధారణ నిర్ధారణ) రిపోర్ట్
దరఖాస్తు చేసుకునే విధానం
మీరు ఈ పథకానికి రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు:
ఆఫ్లైన్ (అంగన్వాడీ ద్వారా): మీ దగ్గర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించి, అక్కడ ఇచ్చే ఫారమ్ను పూర్తి చేసి, మీ డాక్యుమెంట్లను జతచేసి ఇవ్వాలి.
ఆన్లైన్ ద్వారా: PMMVY అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, ‘New Registration / Apply Online’ అనే ఆప్షన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. (గమనిక: ఆన్లైన్లో అప్లై చేసినా, అంగన్వాడీ లేదా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నుండి నిర్ధారణ తప్పనిసరి).
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

