Movies

బిగ్ బాస్ దీక్షా పంత్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలిస్తే నమ్మలేరు

బిగ్ బాస్ షో ద్వారా చిన్న చిన్న నటులు మంచి క్రేజ్ సంపాదించి బాగా సెటిల్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు పెద్దగా పేరు లేకపోయినా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసరికి సెలబ్రెటీలు అయిపోయారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ దీక్ష పంత్ ఒకరు. ఆమె 2010 నుంచి సినిమాల్లో ఉన్న కూడా ఆమె ఎవరికీ తెలియదు. అల్లు అర్జున్,భాను శ్రీ మెహ్రా హీరో,హీరోయిన్స్ గా వచ్చిన వరుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది దీక్ష పంత్. వరుడు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. దీక్షా పంత్ 1993 లో ముంబైలో జన్మించింది. ఆమె తల్లితండ్రులు మధ్యతరగతి కుటుంబీకులు. ముంబైలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దీక్షా మొదట మోడలింగ్ చేసేది. ఆ తర్వాత ఏర్పడిన సినీ పరిచయాలతో బసంతి,పాపారావు గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలలో ఛాన్స్ దక్కించుకుంది.

ఆ తర్వాత ఒక లైలా కోసం,గోపాలా గోపాలా,కవ్వింత,సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాలలో కూడా దీక్షా కనువిందు చేసింది. బిగ్ బాస్ సీజన్ 1 లో ఎవరు ఊహించని విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. దీక్షాకి ధనరాజ్ తో ఉన్న వివాదం మరింత పాపులర్ చేసింది. గోపాలా గోపాలా, శంకరాభరణం సినిమాలు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కాలికి ఆపరేషన్ చేయాలనీ డాక్టర్స్ చెప్పారు.

ఆమె చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకొని కాలికి ఆపరేషన్ చేయించుకుంది దీక్షా పంత్. చాలా రోజుల వరకు ఆమె మంచానికే పరిమితం అయింది. అప్పుడు ఆమెకు కుటుంబ సభ్యుల మద్దతు బాగా ఇచ్చారని చెప్పింది.

ప్రస్తుతం ఈ భామ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. శ్రీకాంత్ హీరోగా ఆపరేషన్ 2019 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్య విడుదల అయినా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.