Movies

శ్రీయ భూపాల్ పెళ్ళికి వెళ్లిన నాగార్జున సోదరి…. షాక్ లో నాగార్జున

అపోలో చైర్మన్ మనవడు ఐంద్రిత్ రెడ్డి,జివికె మనవరాలు శ్రీయ భూపాల్ పెళ్లి ద్వారా ఒకటయ్యారు. అయితే ఏంటట అనవచ్చు. కానీ అక్కడే వుంది అసలు కథ. శ్రీయ భూపాల్ అంతకుముందు అక్కినేని వారి వారసుడు అఖిల్ తో ప్రేమాయణం సాగించింది. నిశ్చితార్ధం వరకూ వచ్చిన ఈ వ్యవహారం ఎందుకో బెడిసికొట్టింది. అఖిల్ లో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన శ్రీయ భూపాల్ ఆతర్వాత విబేధాల కారణంగా విడిపోయాక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.అయితే శ్రీయ భూపాల్ ని రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఓదార్చింది. అంతేకాదు తన కజిన్ అయిన ఐంద్రిత్ రెడ్డితో పెళ్లి కుదిర్చి వైభవంగా పెళ్లి జరిగేందుకు దోహద పడింది కూడా. తాజాగా వీరి పెళ్లి హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఓపక్క తెలంగాణా సంప్రదాయం ఉట్టిపడేలా , మరోపక్క తెలుగుదనం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించిన ఈ పెళ్ళికి తెలంగాణా సీఎం కేసీఆర్, పలువురు మంత్రి వర్గ ప్రముఖులు ,ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి ఆశీర్వదించారు.ఇంతకీ శ్రీయను పెళ్లాడిన ఐంద్రిత్ రెడ్డి ఎవరంటే, టి ఆర్ ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి,అపోలో చైర్మన్ కూతురు సంగీతా రెడ్డి దంపతుల కొడుకు.

అంతేకాదు ఐంద్రిత్ రెడ్డి, శ్రేయ ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్న క్లాస్ మేట్స్. మంచి ఫ్రెండ్స్ కూడా. ఐంద్రిత్ అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే , శ్రీయ కూడా అమెరికాలో ఫాషన్ డిజైన్గ్ లో కోర్సు చేసింది. ఐంద్రిత్ రెడ్డి గురించి మొత్తం తెల్సిన ఉపాసన చొరవ తీసుకుని శ్రీయకు అతడే సరైన జోడీగా గుర్తించి పెళ్లి కుదిర్చింది.

అయితే ఈ పెళ్ళికి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిని చూసి అందరూ షాక్ అయ్యారు. నాగార్జున సోదరి నాగ సుశీల తన కొడుకు సుశాంత్ తో కల్సి పెళ్ళికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. జివికె దంపతులతో స్నేహం కారణంగానే పెళ్ళికి వెళ్లారట. కాగా వీరు ఈ పెళ్ళికి వెళ్లడంపై నాగార్జున కూడా విస్మయానికి గురయినట్లు భోగట్టా.