Devotional

కృష్ణాష్టమి రోజు పూజ ఎలా చేయాలి?

కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే తలస్నానము చేసి తులసి దళాలు వేసిన నీటితో ఆచమనం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి,సాయంత్రం ఇంటి మధ్యలో గోమయంతో అలికి ముగ్గు వేయాలి. ముగ్గు మీద బియ్యం పోసి మంటపం ఏర్పరచి కొత్త కుండను ఉంచాలి. ఆ కుండను వస్త్రంతో అలంకారం చేయాలి. ఈ కులశం మీద కృషుని ప్రతిమ పెట్టి ముందుగా దేవకీదేవి ప్రార్ధన ఆ తర్వాత కృష్ణప్రార్థన చేయాలి. వేగించిన మినపపిండితో పంచదార కలిపి దేవకీదేవికి నివేదన చేయాలి.అర్ధరాత్రి వరకు శ్రీ కృష్ణుడికి పూజలు చేసి పాలు, పెరుగు, వెన్న,అటుకులు,బెల్లం నైవేద్యం పెట్టాలి. రాత్రి జాగారం చేసి మరుసటి రోజు భోజనం చేయాలి.

ఇలా ఉపవాసం,జాగరణ చేయలేనివారు శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి.గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్నికృష్ణుడు ఎక్కికూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి పోన్నపూలంటే ఆ కృష్ణునినికి ఇష్టమని ఆ పూలతో పూజచేస్తారు. దీనినే “పొంనమాను సేవ” అని అంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."