Movies

జయప్రద,జయసుధ,శ్రీదేవి నిజ జీవితంలో జరిగిన ఈ విషయాలు మీకు తెలుసా?

అందానికి జయప్రద, అభినయానికి జయసుధ,డాన్స్ కి శ్రీదేవి ఇలా ఈ ముగ్గురు హీరోయిన్స్ టాలీవుడ్ ని దాదాపు 15ఏళ్లకు పైగా శాసించారు. ఇక ఈ ముగ్గురు హిందీలో కూడా రాణించారు. అయితే నిజ జీవితంలో కష్టాల పాలయ్యారని చెప్పాలి. అంతేకాదు ఈ ముగ్గురూ కూడా నిర్మాతలనే పెళ్ళాడడం విశేషం. అద్భుత మైన కెరీర్ తో ఒకరికొకరు పోటాపోటీగా నటన ప్రదర్శించిన ఈ ముగురు తారలూ జీవితాన్ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వారి జీవితాన్ని మలుపు తిప్పింది.

అప్పట్లో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న శ్రీకాంత్ నహతా ను పెళ్లిచేసుకున్న జయప్రద ఆయనతో ఎక్కువకాలం కల్సి ఉండలేకపోయారు. కోట్ల ఆస్ట్రి గడిచినా,సొంత కుటుంబ సభ్యులే ఆస్తిని నొక్కేశారు. పెళ్లి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్న జయప్రద ను ఉన్నదంతా కుటుంబ సభ్యులు తినేసి ఆమెను ఆర్ధికంగా కూడా కుంగదీసారు. కుటుంబం అంటే ఎవరో కాదు స్వయానా సొంత తమ్ముళ్లే ఆమె ఆస్తిని కరిగించేసారు. అన్నీ పోగుట్టుకున్న జయప్రద చివరకు పొలిటీషియన్ అమర్ సింగ్ చెంతన చేరి,ప్రస్తుతం అతనికి కూడా దూరమై ప్రస్తుతం ఒంటరి బతుకు బతుకుతోంది.

ఇక సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ డబ్బు , ప్రజాభిమానం సంపాదించుకున్నా, జీవితానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిందనే చెప్పాలి. ఓ నిర్మాతను పెళ్లాడిన ఈమె ఆ తర్వాత అతని ప్రవర్తనతో విసిగి, దూరం జరిగింది . ఆ తర్వాత నిర్మాత నితిన్ కపూర్ ని పెళ్లిచేసుకుంది. తాగుడు, పేకాట కు బానిస అయిన అతడు వ్యసనాలతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.

జయసుధ సంపాదించిన సొమ్ముతో సినిమాలు తీసి నష్టాలను చూపించాడు. వ్యసనాలతో ఆస్తిని కరిగించేసాడు. ఆస్థి అంతా పోగొట్టుకుని,చివరకు ఆమె ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో అద్దెకు ఉండాల్సిన దుస్థితికి చేరింది. డబ్బు ఇబ్బందులతో పాటు మానసికంగా నితిన్ కుంగిపోయి చివరకు స్యూసైడ్ చేసుకున్నాడు.

కాగా అందాల తార శ్రీదేవి గురించి చెప్పుకుంటే, వెండితెరపై తన హావభావాలతో ఉర్రుతలూగించిన ఈమె జీవితంలో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. జీవితమంతా కుటుంబం కోసమే కష్టపడాల్సి వచ్చింది. సుఖ పడాల్సిన వయస్సులో బోనీ కపూర్ ని పెళ్లాడిన శ్రీదేవి, చివరకు ఆమె సొమ్ముతో సినిమాలు తీసిన బోనీ ఆస్తులన్నీ కరిగించేసాడు. గుట్టుగా జీవితం నెట్టుకొచ్చి, సైలెంట్ గానే ఈలోకాన్ని వీడింది.