Politics

ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేసిన మొదటి వ్యక్తి శ్రీరాములేనా?

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండు 1920ల కంటే ముందు నుంచే బలంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికే ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మద్రాసు అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆంధ్రా సభ్యులు కొందరు లేవనెత్తారు. పలువురు దీక్షలు కూడా చేశారు.. చేస్తున్నారు. అందులో ప్రధానమైనది స్వామి సీతారామ్‌గా ప్రచారం పొందిన గొల్లపూడి సీతారామ శాస్త్రిది. ఆంధ్ర జిల్లాల్లో పర్యటించి, తగినంత చైతన్యం వచ్చిందని భావించిన తర్వాత గుంటూరు జిల్లాలోని తన ఆశ్రమంలో 1951 ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 20వ తేదీ వరకు నిరాహారదీక్ష చేశారు.

వినోబా భావే పిలుపుతో దీక్షను విరమించారు. తర్వాత 1952 మే 25వ తేదీ నుంచి మూడు వారాలపాటు మరోమారు దీక్ష చేసి, మరలా విరమించారు. ఢిల్లీలో దీక్ష చేయాలని భావిస్తున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు. ఆ సమయంలోనే మద్రాసు సెక్రటేరియట్ ఎదుట రిలే సత్యాగ్రహ దీక్షలు ప్రారంభమయ్యాయి.పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్షప్రారంభించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."