Movies

“ఆపద్బాంధవుడు” సినిమాలో “చిరంజీవి” సరసన నటించిన “మీనాక్షి శేషాద్రి” గుర్తుందా..? ఆమె ఇప్పుడు,ఎక్కడ ఎలా ఉందో తెలుసా..?

ఆపద్బాంధవుడు సినిమాలో చాలా అమాయకంగా కనిపించిన మీనాక్షి శేషాద్రి హిందీలో చాలా పాపులర్ హీరోయిన్. 1981లో 18 ఏళ్ల వయసులో మీనాక్షి శేషాద్రి మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. 1982లో మనోజ్ కుమార్ కొడుకు రాజీవ్ గోస్వామి సరసన పెయింటర్ బాబు సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించింది. 1983లో సుభాష్ ఘయ్ యొక్క విజయవంతమైన చిత్రం హీరో సినిమాతో బాగా పేరుతెచ్చుకున్నది. ఆమె తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. 
మీనాక్షి శేషాద్రి హరీష్ మైసూర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని టెక్సాస్‌లో నివాసం ఉంటుంది. మీనాక్షికి ముగ్గురు పిల్లలు. టెక్సాస్‌లో ‘చెరిష్‌’ పేరుతో డాన్స్‌ స్కూల్‌ని నడుపుతూ భారతీయ సంప్రదాయ నృత్యాలను నేర్పుతూ బిజీగా గడిపేస్తుంది. ఆమె సినిమాల్లోకి రాక ముందే భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్‌లలో చాలా ప్రావీణ్యాన్ని సంపాదించింది. తనకు సమయం దొరికినప్పుడల్లా తన శిష్యులతో కలసి నాట్య ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలను చేస్తుంది.