Politics

తారక్ ప్రచారానికి ఎందుకు వెళ్లలేదో…. ఎవరు వద్దన్నారో తెలుసా ?

ముందస్తు ముచ్చటతో టిఆర్ ఎస్ తెలంగాణా ఎన్నికలకు వెళ్లి, శంఖారావం పూరించడమే కాదు,ప్రజా కూటమిని మట్టికరిపించి మళ్ళీ అధికారం కైవసం చేసుకుంది. ఎన్నికల సందర్బంగా విమర్శలు,ప్రతివిమర్శలు చాలానే వచ్చాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్ తో టిడిపి, టిజెఎస్,సిపిఐ జతకట్టడంతో ప్రజా కూటమి అవతరించింది. పొత్తులో భాగంగా 14సీట్లు టిడిపి కి కేటాయించగా అందులో కూకట్ పల్లినుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కి టికెట్ ఇచ్చారు. చివరకు ఈమె కూడా ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఇక మొత్తానికి ఎన్నికల్లో సాగిన హోరాహోరీ ప్రచారం ఒక ఎత్తు అయితే ఎన్నికలయ్యాక జరిగే చర్చ మరో ఎత్తు అన్నచందంగా ఉంది.

ఇక ఆ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ జోరందుకుంది. సుహాసిని ఎన్నికల ప్రచారానికి తారక్ వెళ్ళలేదు. అలా వెళ్లకపోవడానికి ఓ బలమైన కారణం ఉందన్న విషయం ఇప్పుడు వైరల్ అయింది. అది కూడా ఓ ఆంగ్ల పత్రికలో కథనం రావడంతో మరింత రచ్చ అవుతోంది. నిజానికి ప్రచారం చేయడానికి తారక్ వెళ్లాలని అనుకున్న సమయంలో ఓ వ్యక్తి అడ్డు వేసారట. అది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అంటున్నారు.

కెరీర్ బాగున్న సమయంలో ఇలా ప్రచారానికి వెళ్తే ఇబ్బంది వస్తుందని,దూరంగా ఉండడమే మేలని త్రివిక్రమ్ సూచించారట. అసలు త్రివిక్రమ్ కి ఇంతలా జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పే చనువు ఎక్కడిదని అనుకుంటున్నారా? నిజానికి అరవింద సమేత వీర రాఘవ మూవీ ఈ మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది. ఇదే వీరి తొలిసినిమా కూడా. అయితే అతి తక్కువ మందితో ఫ్రెండ్ షిప్ చేసే,త్రివిక్రమ్ కి, తారక్ కి చాలాకాలం నుంచి మంచి స్నేహం ఉందట.

అందుకే త్రివిక్రమ్ ఇచ్చిన సూచనను తారక్ పాటించాడని కథనం. ఇక ఎన్నికలయ్యాక అనుకోకుండా మంత్రి కేటీఆర్ తో ఓ పార్టీలో తారక్ కలవడం, ఈసందర్బంగా దిగిన ఫోటో ఒకటి వైరల్ అయింది. దీంతో ఈ పరిణామం తారక్, బాలయ్యల మధ్య గ్యాప్ పెంచేలా ఉందని అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో.