Movies

సావిత్రి వజ్రాల నెక్లెస్ సరోజ దగ్గరకెలా వచ్చిందో తెలుసా? నమ్మలేని నిజాలు

మాములుగా అయితే చీరకు తగ్గ మ్యాచింగ్ జాకెట్ కుట్టించుకోడానికి మాత్రమే సామాన్యులకు వీలవుతుంది. కానీ చీరకు తగ్గ నగ చేయించుకునే స్తొమత కేవలం అతికొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కొద్దిమందిలో మహానటి సావిత్రి ఒకరు. ఆరోజుల్లో సావిత్రి ఇంట్లోనే నగలు చేయించే దుకాణం ఉండేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు సావిత్రి అంటేనే నగలు ,చీరలు అని చెప్పొచ్చు. ఒక చీరకు తగ్గ నగ చేయించుకునే స్తొమత సావిత్రి తర్వాతే ఎవరికైనా అన్నట్లు ఉండేది. అప్పట్లో సావిత్రి ఇల్లు నౌకర్లు,చాకర్లు, డ్రైవర్లు ఇలా ఎందరో పనివాళ్ళతో ఓ సంస్థానంలా ఉండేదని చెబుతారు. ఇక కొందరు నగలు తయారు చేసేవాళ్ళు నిరంతరం పొగ గొట్టాలను ఊదుతూ ఆమెకు నగల తయారీలో బిజీగా ఉండేవారట.

భిన్నమైన నగలు తయారుచేయడం,వాటిపై నవరత్నాలను పొడగడం ఇలా నిత్యం బంగారు నగల తయారీ కేంద్రంగా సావిత్రి ఇల్లు సందడి చేసేదని అంటారు. ఇక ఓ సందర్భంలో ఆ ఇంట్లో ఏడువారాల నగలు పొతే, పోనీ అన్నట్లుగానే సావిత్రి ధోరణి ఉండేదట. నగలు పోయాయని పంచాయితీ పెట్టడం, ఎవరు తీశారో ఆరా తీయడం,దొంగలు ఎవరో తేల్చాలి అనడం ఇలాంటివేవీ సావిత్రి ఇంట్లో అసలు కనిపించేవి కావట. పాతచెప్పులు కొత్తవి కొనుక్కొచ్చులే అని ఎలా అనుకుంటామో, పాత నగలు పొతే మళ్ళీ కొత్తవి చేయించుకోడానికి ఇదే మంచి తరుణమన్న తీరులో సావిత్రి ఉండేదట.

ఇక మరో నటి బి సరోజాదేవి. ఈమె సావిత్రి కన్నా ముందే ఎంజీఆర్,శివాజీ గణేశన్ , ఎన్టీఆర్ ఇలా అగ్ర హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఉండేది.ఇంతపెద్ద నటి అయినా హోటల్ కి వెళ్తే అందమైన స్పూన్స్,కర్చీఫ్ లు, నేప్ కిన్స్, ప్లేట్స్ ఇలా చిన్నా చితకా కొట్టేసే అలవాటు సరోజాదేవికి ఉండేదని అంటారు. ఒకసారి ఇలాంటి కేసు స్టేషన్ వరకూ వెళ్ళబోతే ఎంజీఆర్ తప్పించారని అంటారు. అలాంటి సరోజాదేవికి సావిత్రి తన దగ్గర ఉండే రవ్వల నెక్లెస్ ఇచ్చిందట.

ఎంతో ఇష్టమైన ఈ నెక్లెస్ పోతుందని , భద్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సరోజ దగ్గర ఉంచితే అది ఆమె కొట్టేసిందని అంటారు. అయితే,సావిత్రి ఇంట్లో బీరువాలు, లాకర్లు ఉన్నప్పటికీ సరోజాదేవికి ఇచ్చి ఎందుకు దాచాల్సి వచ్చిందనే మాట కూడా మరోవైపు వినిపిస్తోంది.తన కూతురు చాముండేశ్వరి తీసుకుంటుందన్న ఉద్దేశ్యంతో సావిత్రి అలా దాచిందన్న మాట కొందరు చెబుతారు. అయితే సరోజ,సావిత్రి లకు ఒక్క క్షణం కూడా పాడేది కాదని,ఇద్దరి మధ్య ఉప్పూ నిప్పులా ఉండేదని, సావిత్రికి సాగినట్టు తనకూ సాగాలని సరోజ పట్టుపట్టేదని చెబుతుంటారు.

అసలు తన కెరీర్ మంచి రేంజ్ లో నడుస్తున్న సమయంలో సావిత్రి ఎంట్రీ ఇవ్వడం,ఆమె ఎంతంటే అంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధపడడం లాంటివి చూసి సరోజకు కన్నుకుట్టేదట. ఇద్దరి మధ్యా నడిచే ఇగో నేపథ్యంలోకొందరు మరింత ఎగదోసి , ఎడమొగం,పెడమొగం ఉండేలా చేసారని,అటువంటప్పుడు సరోజకు నగ ఇచ్చి దాచమనే స్థితి ఎలా వస్తుందని కొందరు గట్టిగా వాదిస్తున్నారు.