Movies

అభిషేకం సీరియల్ చందన (చింతామణి) గురించి మీకు తెలియని విషయాలు

ఈటీవీలో ధారావాహికంగా వస్తున్న సీరియల్ అభిషేకంలో చింతామణి పాత్రలో నటిస్తున్న మణిచందన ఈ సీరియల్ లో పర్వతాపురం సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసింది. కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరింది. ఈ సీరియల్ లో ఆమె జైలుకి కూడా వెళ్ళింది. సాయికుమార్ కొడుకు అది,రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమాలో కూడా ఈమె నటించింది. బన్నీ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీలో కనిపించింది. 2017లో సునీల్ హీరోగా వచ్చిన సంబరాల రాంబాబు మూవీలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. టివి ఆర్టిస్ట్ సిద్ధార్ధ్,విష్ణుప్రియ పెళ్ళికి వెళ్లి మంచి గిఫ్ట్ ని ప్రజెంట్ చేసింది. ఆచారి అమెరికా యాత్ర,పెళ్ళాం వచ్చింది, దేవి నాగమ్మ,నిజం,ఓ ప్రియతమా, ఎన్టీఆర్ నగర్,అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

ప్రస్తుతం తమిళంలో హీరో కార్తీ సినిమాలో నటిస్తోంది. కాగా 2017జనవరి 22నాటికి అభిషేకం సీరియల్ 2500ఎపిసోడ్స్ పూర్తిచేసుకోవడంతో మణిచందన అవార్డు కూడా తీసుకుని,ఈ ఒక్క సీరియల్ లో కంటిన్యూ అవుతోంది. యాక్టర్ కాకుండా ఉండివుంటే డాక్టర్ ని అయ్యేదాన్ని అని ఆమె చెప్పింది. స్లిమ్ గా అవ్వడం కోసం హార్డ్ వర్క్ చేసి బరువు తగ్గింది.సెక్సీగా ఉండడం కన్నా క్యూట్ గా ఉండడం ఈమెకు బాగా ఇష్టం. 2017లో తన ఉమ్మడి కుటుంబంతో కల్సి గోవా వెళ్ళింది. గుంటూరు జిల్లా తక్కల పాడు గ్రామంలో జులై 6న జన్మించింది. ఈమె ఇంటిపేరు ఇతి. భర్త వాసవీరామ్ పేరు ను ఈ ఏడాది ఏప్రియల్ 9న ఎడమచేతిపై టాటూగా వేయించుకుంది. అతడి భర్త డే అక్టోబర్ 2వ తేదీ. మేనత్త కొడుకునే పెళ్లాడడంతో భర్తను ముద్దుగా బావ అని పిలుస్తుంది. తన భర్తతో టైం స్పెండ్ చేయడం అంటే ఈమెకు చాలా ఇష్టం. ఈమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇక 2018 ఫిబ్రవరి 26నాడు భార్య మణిచందనకు వాసవీ రామ్ సుజుకి కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.

 .