చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త గురించి కొన్ని నమ్మలేని నిజాలు
తెలుగు ఇండస్ట్రీ లో ఎటువంటి సప్పోర్ట్ లేకుండా తన ప్రతిభ తో సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఘనుడు మెగా స్టార్ చిరంజీవి .2 దశాబ్దాలు పాటు నెం.1 స్థానం లో వుంటూ జనుల హృదయాలను సొంతం చేసుకున్న చిరు గురించి ఎంత చెప్పిన తక్కువే .ఆయనకు లెక్కలేనంత మంది అభిమానులు ,అభిమానసంఘాలు ఉండేవి .ఇప్పటికి అవి కొనసాగుతున్నాయి .చిరంజీవి పేరు మీదు గా ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలు జరుగుతూ వుంటాయి .కష్టాల్లో ఉన్నవాళ్లకు చిరంజీవి సాయం చేయడంతో పాటు వాళ్ళ బాగోగుల గురించి అనుక్షణం తపిస్తారు.
ఆయన కుమార్తెలు సుస్మిత,శ్రీజ, కుమారుడు రామ్ చరణ్ తండ్రి ఆలోచనలను తగ్గట్టుగానే ఉంటారు. అందుకే చిరు సంప్రదాయ బద్దంగా వివాహాలు జరిపించి పెళ్లి విశిష్టతను చాటి చెప్పారు . ఇందులో భాగంగా పెద్ద కూతురు సుస్మిత గురించి చెప్పాలి అంటే .. ఆమె వివాహం చెన్నైలో స్థిరపడిన విష్ణు ప్రసాద్ తో జరిగింది. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు.
ప్రసాద్ తాతయ్య L.V. రామారావు అంటే అప్పట్లో చెన్నైలో పేరుమోసిన బిజినెస్ మ్యాన్.
జపాన్, సింగపూర్, థాయిలాండ్, అమెరికా వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు నడిపేవారు. అయన కుమారుడు ఎల్ ఆర్ ప్రసాద్, చంద్రిక దంపతుల తనయుడే విష్ణు ప్రసాద్.బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసిన విష్ణు ప్రసాద్, విదేశాల్లో స్టడీ పూర్తయ్యాక వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టాడు. తాతయ్య ప్రారంభించిన పామాయిల్ వ్యాపారం తండ్రి సారధ్యంలో బాగా డవలప్ అయింది. అయితే విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టాక ఆ వ్యాపారం రెండింతలు అయింది .
విష్ణు ప్రసాద్ వివాహం మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో జరిగింది. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు. ప్రస్తుతం సుస్మిత సినీ రంగంలో అడుగుపెట్టి,చిరు, రామ్ చరణ్ మూవీలకు స్టైలిష్ గా వ్యవహరిస్తోందంటే అందుకు విష్ణు ప్రసాద్ కారణం.భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సుస్మిత , చిరు 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150కి మాస్టర్ స్టైలిష్ గా వ్యవహరించింది. నిజానికి సినీ రంగం నేపధ్యం గల కుటుంబం నుంచి వచ్చిన సుస్మితకు ఆ రంగంలో అభిలాష ఉంటుందని గ్రహించి, ఆమెకు ఇష్టమైన స్టైలిష్ రంగంలో ఎంకరేజ్ చేసాడు విష్ణు ప్రసాద్ .