నమ్రత చిరకాల వాంఛ రాజమౌళి తీర్చుతున్నాడా…ఎలాగో లుక్ వేయండి
ప్రేమించి పెళ్లాడిన మహేశ్ బాబు అంటే నమ్రతకు చాలా ఇష్టం. మహేశ్ బాబు ఎక్కడికి వెళ్లినా, తోడుగా నమ్రత ఉంటుంది కూడా. సినిమా కథల మాటెలా ఉన్నా, మహేశ్ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన నమ్రత భర్త మహేశ్ బాబును బాలీవుడ్కు కూడా పరిచయం చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటోంది. అయితే మహేశ్ బాబు మాత్రం బాలీవుడ్ వద్దు, టాలీవుడ్ ముద్దు అంటూ ఆమె కోరికను ఎప్పటికప్పుడు పెండింగ్లో పెట్టేస్తున్నాడు.
అయితే తాజాగా నమ్రత కోరిక తీరే సమయం దగ్గర పడుతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేశ్ బాబుతో సినిమా చేస్తానని దర్శకధీరుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. జక్కన్న సినిమా అంటే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లో ఉంటుందన్నది నిజం.
దీన్ని బట్టి మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా కూడా టాలీవుడ్, సౌత్ భాషలతో పాటు బాలీవుడ్లోనూ రిలీజ్ చేస్తారని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రకంగా నైనా మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఈ విషయమై ఎప్పటి నుంచో కలలు కంటున్న నమ్రత కోరిక జక్కన్న ద్వారా తీరే ఛాన్స్ వస్తోందన్నమాట.

