Movies

ఈ ఫోటో చూసి అక్కినేని అభిమానులు ఉలిక్కిపడ్డారు…ఎందుకో తెలుసా ?

స్టార్ హీరోయిన్ సమంతా స్నేహితురాలు, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డికి ఈ మధ్యనే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే సమంత ఈ మధ్యనే శిల్పారెడ్డితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన చాలా తక్కువ రోజులకే శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కాకపోతే ఈ ఫోటో రీసెంట్ గా తీసుకున్నారా..లేక పాత ఫోటో ఇప్పుడు సమంతా షేర్ చేసిందా అన్నది అభిమానులకు అర్ధం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది. ఫోటో తాజాగా తీసుకున్నదే అయితే శిల్పారెడ్డికి కరోనా సోకడంతో సన్నిహితంగా మెలిగిన సమంతా ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని అభిమానులు కాస్త ఆందోళనగా ఉన్నారు. అయితే సమంతా ఈరోజు కూడా ధ్యానానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి తనతో కలిసి ధ్యానంలో పాల్గొనాలని అభిమానులను కోరింది. దాంతో సమంత ఆరోగ్యం బానే ఉందని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."