ఖడ్గం సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా…అయితే వెంటనే చూసేయండి
ఖడ్గం మూవీ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సమర్ధతకు గీటురాయి. సినిమాలో కొన్ని సీన్స్ తొలగించాలంటూ కొందరి హెచ్చరికలు,చంపేస్తామంటూ బెదిరింపుల నేపథ్యంలో వాటిని తట్టుకున్నాడు. అయితే సీఎం ,డిజిపి మీటింగ్ పెట్టి కొన్ని సీన్లు తీయమని చెబితే ఐదు సీన్లు పదిరోజుల తర్వాత తొలగించారు. 8కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత 20రోజులకు మన్మధుడు,40రోజులకు నాగ మూవీస్ వచ్చాయి. అయినా ఖడ్గం క్రేజ్ తగ్గలేదు. ఆగస్టు 15అనగానే గుర్తొచ్చే ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే, సిందూరం,అంతః పురం,నిన్నే పెళ్ళాడతా ఇలా డిఫరెంట్ మూవీస్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ చేసిన దేశభక్తి చిత్రమే ఖడ్గం. 1990లో ముంబయిలో జరిగిన దాడుల్లో చాలామంది చనిపోవడంతో అప్పట్లో ఓ కథ రాసుకున్నాడు.
అయితే స్టార్ హీరోల కంటే కొత్తవారితోనే సినిమా చేయడానికి కృష్ణవంశీ ఎక్కువగా ఇష్టపడతాడు. ఎందుకంటే కమర్షియల్ విలువలకన్నా కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హిందీలో శక్తి మూవీ కంప్లిట్ అయ్యాక ఎప్పుడో రాసిన ఖడ్గం మూవీ చేయాలనుకుంటే,చిరంజీవి,బాలయ్య లాంటివాళ్లు ఓపెన్ ఆఫర్స్ ఇచ్చారు. ముగ్గురు స్టార్ హీరోలతో చేస్తే ఈ సినిమా రేంజ్ వేరు. కానీ వాళ్ళని ఒప్పించడం కష్టం. అందుకే మధ్యస్థ హీరోలతో చేయాలని భావించగా సుంకర మధు మురళి నిర్మాణానికి ఒకే చేసారు. కథలో సత్యానంద్ సహకారం అందించగా ,డైలాగ్స్ నటుడు ఉత్తేజ్ రాసాడు.
సిందూరంలో ఛాన్స్ ఇచ్చినందుకు ఈ సినిమాలో చేయడానికి రవితేజ ఒకే చెప్పాడు. ప్రకాష్ రాజ్ కూడా తనపాత్రకు ఒకే. ఇక కీలక రోల్ కోసం వెంకటేష్ ని అడిగితె ఫుల్ బిజీ. నాగార్జున మన్మధుడు మూవీ అయ్యాక సర్జరీ ఉండడంతో కుదరదు. ఇక శ్రీకాంత్ కి ఫోన్ చేస్తే,ఫిదా అయిపోయి ఒప్పేసుకున్నాడు. అయితే సాఫ్ట్ హీరో శ్రీకాంత్ కాకుండా ఇంకొకరిని పెడితే మంచిదని,అవసరమైతే మరో కోటి రూపాయల బడ్జెట్ పెడతానని నిర్మాత అన్నారు. దీంతో నేను శ్రీకాంత్ ని ఫిక్స్ అయ్యా,మీకు వద్దంటే మరో ప్రొడ్యూసర్ ని చూసుకుంటా అని కృష్ణ వంశీ స్పష్టంచేయడంతో నిర్మాత మురళి కాదనలేకపోయాడు. మురారి మూవీతో తానే హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించిన సోనాలి బింద్రే తో పాటు సంగీత, కిమ్ శర్మ తదితర తారాగణం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇక పృథ్వి తన ఆర్ధిక పరిస్థితి బాగోలేదని క్యారెక్టర్ ఇవ్వాలని కోరగా, మంచి క్యారెక్టర్ ఉంది,నీ జీవితమే మారిపోతుంది అని కృష్ణ వంశీ అన్నారు.
ఆవిధంగా 2002జులైలో రామానాయుడు స్టూడియోలో షూటింగ్ స్టార్ట్. ముందుగా ఓం అనే టైటిల్ అనుకున్నా,తర్వాత ఖడ్గం గా మార్చారు. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్,రామోజీ ఫిలిం సిటీలలో షూటింగ్ జరగ్గా, ఎక్కువ భాగం పద్మాలయాలో తీశారు. టెర్రరిస్టుల బిహేవియర్ ఎలా ఉంటుందో ఓ పోలీసాఫీసర్ ద్వారా కృష్ణ వంశీ జైలుకి వెళ్లి మరీ అధ్యయనం చేసారు. 72రోజుల షూటింగ్ ,రెండున్నర కోట్ల బడ్జెట్. హెలికాఫ్టర్ ద్వారా ఎవరికీ తెలీకుండా చార్మినార్ మొత్తం షూట్ చేసారు. నవంబర్ 29న అన్ సీజన్ లో రిలీజైన ఈ మూవీకి కృష్ణవంశీ బ్రాండ్ ఇమేజ్,శ్రీకాంత్,రవితేజ క్రేజ్ తోడై సినిమా ఓపెనింగ్స్ అదిరాయి.
జనానికి పిచ్చగా నచ్చేసింది. ఎక్కడో ఒకచోట మువ్వన్నెల జెండా కనిపించడం, దేశభక్తి,ఎమోషన్ కనిపించడం ఈ మూవీలోని ప్రత్యేకత. పాకిస్తాన్ ముస్లిం వేరు,ఇండియన్ ముస్లిం వేరు అని ఈ మూవీలో చాటిచెప్పారు. శ్రీకాంత్ లో ఇలాంటి నటుడు ఉన్నాడా అనిపించేలా చేసింది. ఇక ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సంగీత నటనకోసం పడే తాపత్రయం బాగా పండింది. షఫీ టెర్రరిస్టుగా విలనిజం పండించాడు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పృద్వి ఈ మూవీతో బాగా పాపులర్ అయ్యాడు. 5నంది అవార్డులు,మూడు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి.