MoviesTollywood news in telugu

వెండితెరపై మెరిసిన బుల్లితెర నటులు…ఎంత మంది ఉన్నారో…?

Telugu Tv serial actress :కొందరు నటులు బుల్లితెర సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. అయితే అందులో కొందరు వెండితెరమీద కూడా తమ సత్తా చాటుతున్నారు. హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో ఎంతో అల్లరి అల్లరిగా కనిపించే భాను పాత్రధారి గోమతి అంతకుముందే ప్రముఖ డైరెక్టర్ బాల డైరెక్షన్ లో నర్సుగా మెరిసింది. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా రిలీజ్ కాలేదు. దేవత హీరోయిన్ సుహాసిని మొదట్లో చంటిగాడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ ఎంత మధురం సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వర్ష సీరియల్స్ చేస్తూనే బి పాజిటివ్ అనే షార్ట్ ఫిలిం లో చేసింది.

వదినమ్మ సీరియల్ లో సీత పాత్రలో నటించిన సుజిత చాలా తెలుగు సినిమాల్లో చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ పసివాడి ప్రాణం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుజిత సత్తా చాటింది. రాధమ్మ కూతురు సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నే అంతకుముందే 2015లో ఇక సెలవ్ అనే తెలుగు మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇటీవల ముగిసిన మౌనరాగం సీరియల్ లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జైన్ మంచి పేరు తెచ్చుకుంది. మౌనరాగం సీరియల్ తో పాటు వినరా సోదరా వీర కుమారా, చల్తే చల్తే, గోళీసోడా, ఎవడు తక్కువ, వంటి సినిమాల్లో కూడా ఈమె నటించింది.

మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా పరిచయమైన కీర్తి భట్ అంతకుముందే కన్నడ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కార్తీక దీపం సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాధ్ లెక్కలేనంత గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ప్రస్తుతం సల్మాన్ త్రీడి అనే మూవీలో నటిస్తోంది. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ తో డబుల్ రోల్ వేసి పేరుపొందిన చైత్ర రాయ్ గతంలో జంబో సవాల్ అనే మూవీ లో నటించింది. జి తెలుగు లో కల్యాణ వైభోగం, రక్త సంబంధం సీరియల్స్ లో నటిస్తున్న మేఘన లోకేష్ తన అందంతో , నటనతో యూత్ ని ఆకర్షిస్తోంది. ఈమె 2018లో అమీర్ పేట టు అమెరికా మూవీలో నటించింది. యాంకర్ రవితో కల్సి ఇది మా ప్రేమ కథ అనే షార్ట్ ఫిలిం లో చేసింది.