MoviesTollywood news in telugu

బుల్లితెర ఆడియన్స్ పై చెరగని ముద్ర వేస్తున్న స్టార్స్

Telugu shows hosted by Tollywood Stars : తెలుగు వెండితెరపై అగ్ర శ్రేణి హీరో హీరోయిన్స్ గా రాణిస్తున్న వాళ్ళు సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లో కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరోవైపు సమంత లాంటి వాళ్ళు వెబ్ సిరీస్,ఓటిటి లో యాంకర్ గా రాణిస్తూ అదనపు ఆదాయం తెచ్చుకుంటున్నారు. అంతేకాదు, బుల్లితెరపై లైవ్ షోస్ ద్వారా మన హీరోలు ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా వరుసగా 3,4 సీజన్స్ లో హోస్ట్ గా చేసిన నాగార్జున ఇప్పుడు సీజన్ 5కి కూడా హోస్ట్ గా చేస్తున్నారు. బుల్లితెరపై కనిపిస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ వన్ విజయవంతంగా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరులు షో చేస్తున్నాడు. ఇదే షో ని గతంలో మూడుసార్లు నాగార్జున హోస్ట్ చేయగా, నాల్గవ షో మెగాస్టార్ చిరంజీవి చేసారు. ఇప్పుడు తారక్ చేస్తున్నాడు.

ఇక బిగ్ బాస్ 4వ సీజన్ లో నాగార్జున కొంచెం గ్యాప్ ఇవ్వగా, ఆ ప్లేస్ లో అక్కినేని కోడలు సమంత హోస్ట్ చేసి అలరించింది. ఆహా ఓటిటి లో హోస్ట్ గా చేసి, చిరంజీవి , అల్లు అర్జున్ లాంటి వాళ్ళను ఇంటర్యూ చేసి అలరించింది. కాగా బిగ్ బాస్ రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. ఇక దగ్గుబాటి వారసుడు రానా నెంబర్ వన్ యారి ప్రోగ్రాంతో హోస్ట్ గా చేస్తూ తనలోని టాలెంట్ చూపిస్తున్నాడు.