kshana kshanam సినిమాని 267 సార్లు చూసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
kshana kshanam Movie : మన అభిమాన హీరో, హీరోయిన్ ల గురించి ఏ విషయం తెలిసిన చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు. మన తెలుగు అమ్మాయిలు పరభాషలో బాగా సక్సెస్ అవుతున్నారు. గూడచారి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన శోభితా ధూళిపాళ బాలీవుడ్లో సత్తా చాటుతోంది. తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో సత్తా చాటుతుంది.
అలాగే మరొక తెలుగమ్మాయి శ్రేయ ధన్వంతరి బాలీవుడ్లో జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది ఫ్యామిలీ మాన్,స్కాం 1992 వెబ్ సిరీస్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ రాలేదు.
దాంతో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది. తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తానని, తన ఫేవరెట్ సినిమా శ్రీదేవి నటించిన క్షణక్షణం సినిమా అని, ఈ సినిమాని 267 సార్లు చూశానని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పింది.