తళుక్కున మెరిసి ఇండస్ట్రీ నుంచి మాయమైన భామలు…ఇప్పుడు ఏమి చేస్తున్నారో…?
Tollywood Actress : సినిమా రంగంలోకి ఎందరో వస్తుంటారు వెళ్తుంటారు. అలాగే ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వచ్చి, వెళ్లినా, కొందరు మాత్రం ఒకట్రెండు సినిమాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని తమదైన ముద్రవేశారు. 2000 తర్వాత కొందరు భామలు అలా వచ్చి తళుక్కున మెరిసి అప్పుడే మాయమయ్యారు. అలాంటి వాళ్ళను పరిశీలిస్తే, చాలామందే వుంటారు. కొందరు తమతో పనిచేసిన హీరోలను పెళ్ళాడి సెటిల్ అయ్యారు.
నువ్వే కావాలి మూవీలో లవర్ బాయ్ తరుణ్ తో కల్సి నటించిన రిచా, అలాగే నువ్వు నేను అనే మూవీలో నటించిన అనిత, లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ తో కల్సి టాలీవుడ్ లో చిత్రం మూవీతో ఎంట్రీ ఇచ్చిన రీమా సేన్ మరికొన్ని సినిమాల్లో చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి లో నటించిన రేణు దేశాయ్ ప్రేమలోపడి పవన్ ని పెళ్లాడింది. అలాగే వంశీ సినిమాలో నటించిన నమ్రత శిరోద్కర్ అదే మూవీలో మహేష్ బాబుతో ప్రేమలోపడి పెళ్లి చేసుకుంది.
అదేవిధంగా స్టూడెంట్ నెం 1లో జూనియర్ ఎన్టీఆర్ సరసన గజలా తర్వాత కొన్ని సినిమాల్లో చేసింది. అలాగే ఇడియట్ సినిమాలో చేసిన రక్షిత మరికొన్ని మూవీస్ చేసింది. 6 టీన్స్ మూవీలో రుతిక, సంతోషం మూవీలో చేసిన గ్రేసీ సింగ్, మన్మథుడు మూవీలో నటించిన అన్షు, టక్కరి దొంగ మూవీలో చేసిన లిసా రే, బన్నీ మూవీలోఅల్లు అర్జున్ తో జోడికట్టిన గౌరీ ముంజల్, దిల్ మూవీలో చేసిన నేహా, ఆర్య మూవీలో అను మెహతా, ఒకటి రెండు సినిమాలతోనే ఆడియన్స్ లో చెరగని ముద్రవేశారు.