MoviesTollywood news in telugu

Tollywood:సినిమాలను వదిలి విదేశాల్లో సెటిల్ అయిన హీరోయిన్ లు

Tollywood Heroines :మన అభిమాన హీరో, హీరోయిన్ ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుని,తమ కుటుంబాలతో ప్రస్తుతం ఫారిన్ లో నివసిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ అనే తేడా లేకుండా చాలామంది విదేశాల్లో స్థిరపడ్డారు.

ఇందులో ముఖ్యంగా మీనాక్షి శేషాద్రి బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా వెలిగింది. తెలుగులో ఆపద్భాంధవుడు మూవీలో మెగాస్టార్ సరసన నటించింది. ప్రస్తుతం టెక్సాస్ లో ఉంటోంది. బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటోంది. ఇక ప్రేమంటే ఇదేరా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింటా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో నివసిస్తూ, సినిమాల్లో చేస్తోంది.

ఖైదీ లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు అగ్ర నటులతో నటించిన మాధవి మాతృదేవో భవ మూవీతో క్లాసికల్ గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం న్యూ జెర్సీ లో నివసిస్తోంది. టాలీవుడ్ లో సీనియర్ నటులతో నటించి ఒక ఊపు ఊపేసిన రంభ యంగ్ జనరేషన్ నటులతో కూడా జతకట్టింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న ఈమెకు ముగ్గురు పిల్లలు.

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ తెలుగులో బ్రహ్మ మూవీలో మోహన్ బాబు సరసన నటించింది. తెలుగులో ఆఫర్స్ వచ్చినా ఇతర భాషా చిత్రాలవైపే మొగ్గు చూపిన ఈమె ప్రస్తుతం దుబాయ్ లో ఉంటోంది.