Movies

Telugu Serial Actresses Remuneration: బుల్లితెర హీరోయిన్స్ ఒక్కో ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటారో తెలుసా

Telugu Serial Actresses Remuneration:కొంతకాలం క్రితం వరకూ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఒకటి ఉండేది. కానీ నిదానంగా టీవీ షోస్, సీరియల్స్ హవా మొదలైంది. జనాలు టీవీకి అతుక్కు పోయే విధంగా సీరియల్స్ ఉంటున్నాయి. సీరియల్స్ లో నటించే నటులు ఎంత పారితోషికం తీసుకుంటారో అనే విషయం గురించి ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండటం సహజమే. ఇప్పుడు మనం రోజు సీరియల్స్ లో చేసే నటులు రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటారు అనే విషయం తెలుసుకొందాం.

ప్రేమి విశ్వనాథ్ – కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క బాగా ఫేమస్ అయింది. ఈమె ఒక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటుంది. మొదట్లో ప్రేమి విశ్వనాధ్ రోజుకి 15000 తీసుకునేది. కానీ ఇప్పుడు సీరియల్ కి వచ్చిన క్రేజ్ తో ఎపిసోడ్ కి లక్ష తీసుకుంటుంది.

నవ్య స్వామి – ఈమె ఒక్క రోజుకి 25000 రూపాయల పారితోషికం తీసుకుంటుంది.

అగ్నిసాక్షి సీరియల్ తో పరిచయమైన ఐశ్వర్య రోజుకి 30 వేల రూపాయలను పారితోషికంగా తీసుకుంటుంది.

కార్తీకదీపం సీరియల్లో విలన్ గా చేస్తున్న శోభ శెట్టి రోజుకి పదివేల రూపాయలు పారితోషికం గా తీసుకుంటుంది.

మౌనరాగం సీరియల్లో మూగ అమ్మాయి గా నటించి అందరి మనసులో స్థానం సంపాదించిన ప్రియాంక జైన్ ఒక్క రోజుకి 25 వేల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుంది.

వెండితెరపై సినిమాలు చూసి అవకాశాలు రాక బుల్లితెరకు షిఫ్ట్ అయిన సుహాసిని సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సీరియల్స్ నిర్మిస్తుంది. అంతేకాక సీరియల్స్ లో నటిస్తే రోజుకి 25 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటుంది.

అమెరికా అమ్మాయి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన మెరీనా రోజుకి పదివేల రూపాయిల పారితోషికాన్ని తీసుకుంటుంది.

నవీన ఒక్క రోజుకి పది వేల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుంది.

వదినమ్మ సీరియల్ లో నటించిన సుజిత రోజుకి పదివేల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుంది.

హరితేజ సీరియల్స్ కాకుండా కేవలం ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తుంది. ఈమె ఒక ప్రోగ్రాం కి 30 వేల రూపాయలు తీసుకుంటుంది.