Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ సీరియల్ కిల్లర్ మూవీ – ఎలా ఉందంటే..
Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల అయింది. కేవలం 20 రోజుల్లోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచి ఈ సినిమాను ఆహా ఓటీటీలో చూడవచ్చు.
ఈ సినిమాలో శివ కందుకూరి హీరోగా నటించాడు. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. ఇక కథ విషయానికి వస్తే.. మహిళల్ని హత్య చేస్తోన్న సైకో వారి తలల స్థానంలో దిష్టిబొమ్మలను పెడుతుంటాడు.
17 మంది అమ్మాయిలు చనిపోయిన ఒక్క క్లూ కూడా పోలీసులు సంపాదించలేకపోతారు. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దిష్టి బొమ్మ హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.
ఈ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. హీరోకి సాయంగా హీరోయిన్ లక్ష్మి (రాశీ సింగ్) జర్నలిస్ట్ సయం చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో పెద్దగా ట్విస్ట్లు లేవు. సెకండ్ ఆఫ్ పరవాలేదని అనిపిస్తుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా కథాగమనం చాలా స్లో ఉండటం సినిమాకి మైనస్ అయింది.