Aadhaar Update: మీ పిల్లలకు ఏడేళ్లు దాటాయా.. ఆధార్ అప్డేట్ చేయకపోతే ఏమి అవుతుందో తెలుసా..?
Aadhaar Update: మీ పిల్లలకు ఏడేళ్లు దాటాయా.. ఆధార్ అప్డేట్ చేయకపోతే ఏమి అవుతుందో తెలుసా.. యూఐడీఏఐ ఏడేళ్లు దాటిన చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐევల్లు ఐదేళ్ల లోపు పిల్లల చేతివేలి ముద్రలు, ఐరిస్ వివరాలను సేకరించదు, ఎందుకంటే వారి శరీర లక్షణాలు పూర్తిగా రూపొంది ఉండవు.
అందువల్ల, ఐదేళ్ల లోపు చిన్నారులకు కేవలం పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలతోనే ఆధార్ కార్డు జారీ చేస్తారు, తల్లిదండ్రులలో ఒకరి బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు. అయితే, ఐదేళ్లు దాటిన తర్వాత పిల్లల ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వివరాలను సేకరిస్తారు, దీనిని ఫస్ట్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఎమ్బీయూ) అంటారు.
యూఐడీఏఐ మరో ముఖ్యమైన సూచనను జారీ చేసింది. ఏడేళ్లు దాటిన చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయని తల్లిదండ్రులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల తాజా ఫొటో, పేరు, వయసు, పుట్టిన తేదీ, చిరునామా వివరాలను తగిన ధ్రువీకరణ పత్రాలతో సమర్పించాలని సూచించింది.
ఆధార్ అప్డేట్ తప్పనిసరి
ఐదు నుంచి ఏడేళ్ల లోపు చిన్నారుల ఎమ్బీయూ ఉచితం, అయితే ఏడేళ్లు దాటితే రూ.100 రుసుము చెల్లించాలి. ఏడేళ్ల వయస్సు దాటినా ఎమ్బీయూ పూర్తి కాకపోతే ఆధార్ కార్డు డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్లకు సమాచారం పంపడం ప్రారంభించింది.
ప్రస్తుతం స్కూల్ అడ్మిషన్లు, ఎంట్రన్స్ పరీక్షల రిజిస్ట్రేషన్లతో సహా అనేక సేవలకు ఆధార్ తప్పనిసరి. అందువల్ల, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలని యూఐడీఏఐ సూచిస్తోంది.

