Movies

చైతు వరుస సినిమాలు కమిట్…వెనక ఎవరు ఉన్నారో తెలుసా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టొరీ సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది.లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత పరశురాంతో సినిమా కమిట్ అయ్యాడు. కాని పరశురాంకి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఒకే అవడంతో ఇప్పుడు తన ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చైతు రెడీ అవుతున్నాడు.

నిజానికి చైతూ 14 రీల్స్ వారికి డేట్స్ ఇచ్చాడు. అయితే పరశురాం సినిమా ఆగిపోవడంతో 14 రీల్స్ సంస్థ ఆ డేట్స్ ని దిల్ రాజుకి ఇచ్చేసింది. ఇప్పటికే దిల్ రాజు మంచి కథని సిద్ధం చేసుకొని చైతూకి చెప్పడంతో ఇప్పుడు దానిని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడట. ఎప్పుడు సొంత కథలు మాత్రమే రాసుకొని సినిమాలు తీసే విక్రమ్ కుమార్ కి వరుసగా రెండు ఫ్లాప్ లు రావడంతో దిల్ రాజు అతని కథని నమ్మలేదు.

బివిఎస్ రవి రాసిన కథని విక్రమ్ కి అప్పగించి దానిని దర్శకత్వం చేయాలని దిల్ రాజు ఇప్పటికే చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తనని తాను ముందుగా నిరూపించుకోవాల్సి ఉంది. అందుకే విక్రమ్ కుమార్ కూడా ఇదే కథని తనశైలికి తగ్గట్లు మార్చుకొని చైతూతో లాంచ్ చేయడానికి కసరత్తు చేస్తున్నాడట. ఏది ఏమైనా లాక్ డౌన్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని దిల్ రాజు స్టార్ట్ చేస్తాడని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."