Kitchenvantalu

Pesarattu:పెసరట్టుకి పిండి ఇలా వేసుకుంటే హోటల్ లో కంటే చాలా రుచిగా ఉంటాయి

Pesarattu:పెసరట్టు..తెలుగు వారి ఫేవరేట్ టిఫిన్ పెసరట్టు.ఎంతో ప్రోటీన్ కంటెంట్ ఉండే పెసరట్టు ఆరోగ్యానికి కూడ చాలా మంచిది.

కావాల్సిన పదార్ధాలు
పెసలు – 1 కప్పు
బియ్యం – ¼ కప్పు
పచ్చిమిర్చి – 4
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం – చిన్న ముక్క

తయారీ విధానం
1.పెసలు,బియ్యాన్ని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.నానిన పెసలను గ్రైండ్ చేసుకోవాలి.
3.అందులోనే అల్లం ,పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.
4.గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్సఫర్ చేసుకోని తగినన్ని నీళ్లను యాడ్ చేసి దోశ కన్ సిస్టెన్సీ లో తయారు చేసుకోవాలి.
5.అందులోకి జీలకర్ర వేసి కలుపుకోవాలి.
6.స్టవ్ పై దోశ ప్యాన్ వేడిచేసుకోని గరిటడు పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.
7.కాస్త వేగాక అవసరం అనుకుంటే ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి ,కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు.
8.అంచులకు నెయ్యి,లేదా నూనె వేసి పెసరట్టును ఎర్రగా కాల్చుకోవాలి.
9.అంతే వేడి వేడి పెసరట్టు రెడీ.