Biyyam Pindi Rotte:బియ్యంపిండితో హెల్తీగా రుచిగా 10నిమిషాల్లో ఇలా “రొట్టెలు” చేయండి..
Biyyam Pindi Rotte:బియ్యంపిండితో హెల్తీగా రుచిగా 10నిమిషాల్లో ఇలా “రొట్టెలు” చేయండి.. మనం వంటింట్లో బియ్యం పిండితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో రొట్టెలు కూడా తయారు చేయవచ్చు. పూర్వకాలంలో ఈ రొట్టెలను ఎక్కువగా చేసేవారు. బియ్యం పిండి రొట్టెలు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ రొట్టెల తయారీకి కావాల్సిన పదార్థాలు మరియు విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి రొట్టెల తయారీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం పిండి – 1½ కప్పు
నానబెట్టిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది)
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2
సన్నగా తరిగిన కరివేపాకు – 1 రెమ్మ
నూనె – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినంత
బియ్యం పిండి రొట్టెల తయారీ విధానం:
ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కరివేపాకు వేసి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని మెత్తగా కాకుండా కలపాలి.
ఒక పాలిథీన్ కవర్పై కొద్దిగా నూనె రాసి, కావలసిన పరిమాణంలో పిండిని తీసుకొని, చేత్తో వత్తుకుంటూ పలచగా కాకుండా రొట్టె ఆకారంలో చేయాలి.ఒక పెనంపై నూనె వేసి, ముందుగా తయారు చేసిన రొట్టెను వేసి, రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చాలి.ఈ విధంగా చేస్తే రుచికరమైన బియ్యం పిండి రొట్టెలు సిద్ధమవుతాయి.
ఈ రొట్టెలు రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీటిని ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్గా తినవచ్చు.

