Rice Bugs:బియ్యంలో పురుగులు పడుతున్నాయా? రూపాయి ఖర్చు లేదు.. ఈ చిన్న పని చేస్తే పురుగులన్నీ పరార్!
Rice Bugs:బియ్యంలో పురుగులు పడుతున్నాయా? రూపాయి ఖర్చు లేదు.. ఈ చిన్న పని చేస్తే పురుగులన్నీ పరార్… బియ్యం బస్తా కొన్న కొద్ది రోజులకే అందులో నల్ల పురుగులు (Weevils), ముక్క పురుగులు చేరడం ప్రతి ఇంట్లో ఉండే సమస్యే. వాటిని ఏరలేక, తినలేక చాలామంది బియ్యాన్ని పారేస్తుంటారు. కానీ వంటింట్లో దొరికే వాటితోనే పురుగులను తరిమికొట్టవచ్చు.
మీ బియ్యం ఏడాదైనా పాడవకుండా ఉండాలంటే ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి:
1. ఎండు మిరపకాయల మ్యాజిక్: ఇది మన అమ్మమ్మల నాటి చిట్కా. బియ్యం నిల్వ చేసే డబ్బాలో లేదా బస్తాలో మధ్య మధ్యలో 3-4 ఎండు మిరపకాయలు వేయండి. వాటి ఘాటైన వాసనకు పురుగులు ఆ దరిదాపుల్లోకి కూడా రావు. ఉన్నవి కూడా పారిపోతాయి.
ALSO READ:ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? అది నీళ్లు కాదు విషం.. ఈ భయంకరమైన రోగాలు గ్యారెంటీ!
2. అగ్గిపుల్లల ట్రిక్: వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒక చిన్న గుడ్డలో కొన్ని అగ్గిపుల్లలను (Matchsticks) చుట్టి బియ్యం డబ్బాలో పెట్టండి. అగ్గిపుల్లల్లో ఉండే సల్ఫర్ (గన్పౌడర్) వాసన పురుగులకు అస్సలు పడదు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
3. స్పెషల్ మసాలా పొట్లం: పురుగులు మొండిగా ఉంటే ఈ ప్రయోగం చేయండి.
ఒక టిష్యూ పేపర్ లేదా పల్చటి గుడ్డలో.. 20 లవంగాలు, 20 మిరియాలు, ఒక స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు వేసి మూట కట్టండి.దీన్ని బియ్యం మధ్యలో ఉంచితే.. ఆ ఘాటుకు ఒక్క పురుగు కూడా బతకదు.
4. లవంగాలు: కేవలం బియ్యమే కాదు.. కందిపప్పు, గోధుమ పిండి వంటి వాటిలో కూడా 5-10 లవంగాలు వేసి ఉంచితే పురుగులు పట్టవు. రుచి కూడా మారదు.
5. ఎండ తగలనివ్వండి: తేమ వల్లే పురుగులు పుడతాయి. కాబట్టి కనీసం 15 రోజులకు ఒకసారైనా బియ్యాన్ని ఓ గంట సేపు ఎండలో ఆరబెట్టండి. దీనివల్ల పురుగులు చనిపోవడమే కాదు, బియ్యం తాజాగా ఉంటాయి.
కెమికల్స్ వాడి ఆరోగ్యం పాడుచేసుకునే బదులు, ఈ న్యాచురల్ టిప్స్ ట్రై చేయండి.. బియ్యాన్ని సేవ్ చేయండి!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

