Movies

జెమిని గణేశన్ కూతుళ్ళ అత్యవసర సమావేశంలో సంచలన నిర్ణయం

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మహానటి సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయినా మహానటి సినిమా హిట్ టాక్ ని మొదటి రోజు నుంచే సొంతం చేసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాక US లో స్టార్ హీరోలతో సమానంగా 2 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా విడుదల అయ్యాక సావిత్రి గురించి ఇంకా తెలుసుకోవాలనే కుతుహులం పెరిగింది. ఆమె మరణించిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి ? జెమిని గణేశన్ పిల్లలు ఎవరు అంటూ గూగుల్,వికీపీడియాలో సెర్చ్ చేయటం ప్రారంభించారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది.

జెమిని గణేశన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు మొత్తం మీద ఏడుగురు కూతుళ్లు,ఒక కొడుకు. మూడో భార్య అయిన సావిత్రికి కొడుకు సతీష్,కూతురు విజయ చాముండేశ్వరి ఉన్నారు. రెండో భార్య పుష్ప వల్లికి రేఖ,రాధ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహానటి సినిమాలో జెమిని గణేశన్ ను అసభ్యంగా చూపారని, ఈ విషయాన్ని చర్చించటానికి చెన్నై లో సమావేశం అయ్యారట.

మహానటిలో జరిగిన తప్పిదాలను ఖండించటానికి కలిసికట్టుగా పోరాటం చేయాలనీ డిసైడ్ అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలో జెమిని గణేశన్ కూతుళ్లు అందరూ ఉన్నారు. కమల సెల్వరాజ్,రేఖ,రేవతి,నారాయణి,జయ శ్రీధర్,విజయ చాముండేశ్వరి,రాధ ఇలా అందరు కలిసిన దిగిన ఫోటోను చూస్తే అందరి మధ్య అముఞ్చి అనుబంధం ఉందని చెప్పాలి.