Movies

సావిత్రిని ఘోరంగా మోసం చేసిన సత్యం ఎవరో…. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

మహానటి సినిమాలో అందరి దృష్టి సావిత్రి,జెమిని గణేష్ పాత్రలు పోషించిన కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ మీదనే ఉంది. కానీ ఈ సినిమాలో మహేష్ కూడా ప్రేక్షకుల మైండ్ లో నిలిచే పాత్రను పోషించాడు.మరీ రంగస్థలంలో ఉన్నంత లేకపోయినా మంచి గుర్తింపుని పొందాడు. ఈ సినిమాలో తన పాత్ర పేరు సత్యం. నిజజీవితంలో అసలు సత్యం ఉన్నడా?…. అసలు ఉంటె ఇప్పుడే ఎక్కడ ఉన్నట్లు అన్న సందేహం కలగవచ్చు…. ఇప్పుడు ఆ విషయానికి వస్తే అసలు సత్యం అనే వ్యక్తి సావిత్రి నిజజీవితంలో ఎవరు లేరు. సావిత్రిని ఈ తరహా లో మోసంచేసినవారు తన చుట్టూ చాల మంది ఉన్నారని చూపించడం కోసం ఈ పాత్రను ఉపయోగించారట నాగ్ అశ్విన్.

ఈ సినిమాలో కార్ డ్రైవర్ , మేకప్ చేసే ఆమె వీరి కి సంభందించిన అంశాలను చిత్రం లో చూపించలేకపోయాన ని నాగ్ అశ్విన్ అన్నారట. సావిత్రి జీవితాన్ని ఇంత బాగా చూపించాలంటే ఎన్ని ఎపిసోడ్స్ పడతాయో మరి.

కానీ నాగ్ అశ్విన్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ లో బయోపిక్స్ తీసేవారికి ఆదర్శంగా నిలిచేటట్లు ఈ సినిమాను చిత్రీకరించారు. అశ్విన్ ను చూసి కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరో,హీరోయిన్ ల బయోపిక్ చేయడానికి రీసెర్చ్ కుడా మొదలు పెట్టారట.