Movies

చిన్మయితో సమంతా బ్రేక్ అప్…. 8 ఏళ్ల స్నేహం ఎందుకు ముక్కలైందో తెలుసా?

ఒకప్పుడు తెలుగులో నటించే పరభాష నటులు తెలుగును నేర్చుకోవటానికి ఆసక్తిని అసలు చూపేవారు కాదు. డబ్బింగ్ సంగతి పక్కన పెడితే,సినిమా వేడుకల్లో నమస్కారం అని చెప్పటం కూడా సరిగా వచ్చేది కాదు. ఉత్తరాది భామలు మరియు చెన్నయ్ భామ త్రిష లాంటి వారు కూడా ఒక్క ముక్క తెలుగు కూడా నేర్చుకోవటానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పటి కథానాయికలు ఆలా కాదు. సినిమాలు మొదలు పెట్టిన సంవత్సరం లోపే తెలుగును చక్కగా మాట్లాడేస్తున్నారు. అంతేకాక కొంత మంది హీరోయిన్స్ అయితే డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటున్నారు. సమంతా సైతం ఇటీవల ‘మహానటి’ సినిమాతో డబ్బింగ్ చెప్పటం ప్రారంభించేసింది.

అయితే సమంతా ఇక తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. సమంతా నటించిన తమిళ సినిమా సూపర్ డీలక్స్ లోను తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. తమిళ డబ్బింగ్ కి డబ్బింగ్ చెపుతున్న ఫోటోను సమంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సమంతాకు 2010 లో విడుదల అయినా ‘ఏ మాయ చేసావే’ సినిమా నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు ఎనిమిది సంవత్సరాలు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు సమంతా పెట్టిన ఫోటోకి విచిత్రంగా ట్వీట్ చేసింది చిన్మయి.

ఫన్నీ హావభావాలతో కొన్ని ఈమోజీలను పెట్టింది. సమంతా ఇలా వరుసగా సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటూ పొతే తనకు సమంతాకు డబ్బింగ్ బంధం తెగిపోతుందేమో అని ఫీల్ అవుతుందేమో… అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.