Movies

ఎవరు ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనసూయ.

యాంకరింగ్ తో ఫుల్ బిజీగా ఉండే అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో బాగా పాపులర్ అయింది. రంగస్థలం అనసూయకు మంచి పేరును తెచ్చిపెట్టటమే కాకుండా ఎన్నో మంచి అవకాశాలను పొందేలా చేస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుంది. ఏమైనా అనసూయ కెరీర్ మొదటి నుంచి కూడా సినీ అవకాశాలను బాగా అలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుంది. రంగస్థలం హిట్ అయినా అదే సూత్రాన్ని ఫాలో అవుతుంది. తాజాగా మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న సినిమాలో నటిస్తుంది. దివంగత రాజశేఖర రెడ్డి బయో పిక్ ని యాత్ర పేరుతొ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రాజశేఖర రెడ్డిగా మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించటానికి అనసూయ కూడా ఒకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో అనసూయ కర్నూల్ కి చెందిన పాపులర్ మహిళా లీడర్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి జీవితంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అనసూయ చేసే పాత్ర నిడివి తక్కువైనా ప్రతి పాత్ర గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పాత్రను తీర్చిదిద్దుతున్నారు.