Movies

ఎలిమినేషన్ తప్పించుకోడానికి ఈ ముగ్గురూ భారీ కుట్ర… ఏమిటో తెలుసా?

గెలవడానికి ట్రై చేస్తూనే, గెలుపు ఓటములను ఒకేలా చూస్తారు కొందరు. ఇక మరికొందరు అయితే ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తారు. ఇందుకోసం ఏ అవకాశాన్ని జారవిడిచుకోరు. ఇదంతా ఎందుకంటే బిగ్ బాస్ వన్ సక్సెస్ కావడంతో బిగ్ బాస్ 2కూడా నడిపిస్తున్నారు నిర్వాహకులు. ఇక ఇందులో కొందరు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోడానికి ముందస్తు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారట 16 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేటి అయ్యారు. 106 రోజులపాటు సాగే ఈ షోలో ప్రతి వారం ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఎలిమినేటి చేస్తూ వస్తున్న సంగతి తెల్సిందే. అయితే చివరి వరకూ షోలో కంటిన్యూ అవ్వడానికి హౌస్ లోకి వెళ్లకముందే జాగ్రత్త పడ్డారని టాక్ నడుస్తోంది.

అదేంటంటే, ఈ షోలో ఓటింగ్ ద్వారా ఎలిమినేటి రౌండ్ ఉంటుంది. అందుకే కొందరు సోషల్ మీడియా ద్వారా టీమ్స్ ఏర్పాటు చేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ టీమ్ ల ద్వారా ఎక్కౌంట్స్ తెరిపించి,తమకు అనుకూలంగా ఓటింగ్ సంపాదించి ఎలిమినేటి కాకుండా ఉండాలని భావిస్తున్నారట. ఈవిధంగా చేస్తున్న వారిలో ఇద్దరి, ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలిమినేషన్ రౌండ్ నుంచి వీరిని కాపాడడమే ధ్యేయంగా సోషల్ మీడియా టీమ్స్ కృషిచేస్తున్నాయి. ఇందుకోసం ఈ టీమ్స్ కి కొంత డబ్బు ముట్టజెప్పి మెయింటేన్ చేస్తున్నారు.ఇలా ప్రమోట్ చేయించుకుంటున్న వారిలో తేజస్వి , యాంకర్ దీప్తి, దీప్తి సునయన ఉన్నట్లు చెబుతున్నారు. టైటిల్ గెలవడానికి ముందస్తుగా ప్లాన్ చేసుకొని మరీ ఈ ముగ్గురూ హౌస్ లోకి అడుగుపెట్టారని టాక్.

అయితే టైటిల్ వరకూ ఏమోగానీ కనీసం చివరి వరకూ అయినా వీళ్ళు కొనసాగుతారా? ఏమో చెప్పలేం, ఎందుకంటే బయట ఉండగానే ఇలాంటి బిగ్ ప్లాన్ వేసిన ఈ ముగ్గురూ ఇక హౌస్ లో ఎలాంటి ఎత్తులు వేస్తారో మరి. మొత్తానికి సోషల్ మీడియా ఏజన్సీలకు భారీగానే సొమ్ములు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాలి.