Movies

చిరంజీవితో ఆడి పాడిన మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఏ రంగంలో సెటిల్ అయిందో తెలుసా?

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. దివంగత ఎన్టీఆర్ తో , అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా నటించి తనదైన శైలితో ఈ అగ్ర నటి మెప్పించింది. ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించింది. తమిళ కుటుంబానికి చెందిన ఈమె భరతనాట్యం,కూచిపూడి,కథక్, ఒడిసి లాంటి డాన్సుల లో ప్రావీణ్యం గడించింది. ఢిల్లీ లో స్టడీస్ టైం లోనే మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయింది.ఇక ఈమెకు మోడల్ గా అవకాశాలు రావడంతో టాప్ మోడల్ గా పేరు తెచ్చుకుంది. అదే ఆమెను సినీ జీవితం వైపు నడిపించాయి. పాయింటర్ బాబుతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి, శభాష్ రాముడు డైరెక్షన్ లో హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి, ఒక్క రోజులో స్టార్ హీరోయిన్ అయిపొయింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్నీ డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

అంతేకాదు, మీనాక్షి 1980- 90లలో భారీ రెమ్యునరేషన్ తీసుకున్న తీసుకున్న హీరోయిన్ గా నిల్చింది. సీనియర్ ఎన్టీఆర్ తో బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో నటించి,మెగాస్టార్ చిరంజీవితో ఆపద్భాంధవుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు. అమెరికాలోని టెక్సాస్ ఇన్వెస్ట్ బంకర్ అయిన హరీష్ మైసిన్ ని మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ముగ్గరు పిల్లలు. గుర్తుపట్టలేనంతగా ఎదిగిపోయిన ఆమె ప్రస్తుతం అమెరికాలో డాన్స్ స్కూల్ నడుపుతూ కుటుంబంతో చాలా సంతోషంగా వుంది.