ఎన్టీఆర్ బయో పిక్ లో శ్రీదేవిగా రకుల్ ఎంత పారితోషికం డిమాండ్ చేసిందో తెలుసా?
బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని చాలా ప్రతిషాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తుంది. ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తుండగా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు.
ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. వేటగాడు సినిమాలో ఫేమస్ సాంగ్ లో బాలకృష్ణ, రకుల్ లు ఎన్టీఆర్, శ్రీదేవిలా అదరగొట్టారని తెలుస్తుంది. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన పాపులర్ సాంగ్స్ కూడా త్వరలో షూట్ చేయనున్నారని సమాచారం.
అయితే శ్రీదేవి పాత్ర పోషిస్తున్న రకుల్ రెండో భాగం మహానాయకుడులో కనిపించనుందని టాక్. ఇందులో 20 నిమిషాలు మాత్రమే రకుల్ పాత్ర ఉండగా, దీని కోసం కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుందని విశ్వసనీయ వర్గాల నుండి తెలుస్తుంది.