Movies

చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఏ పార్టీ తరుపున ప్రచారం చేయటానికి సిద్ధం అయిందో తెలుసా/

కోల్ కత్తా భామ అయినా, దక్షిణాదిన రీమా సేన్ కి ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. మొదట్లో యాడ్స్ రంగంలో రాణించిన ఈమె తెలుగులో ఉదయకిరణ్ తో కల్సి తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘చిత్రం’సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఇద్దరికీ ఆ సినిమా కొత్తదే. అయినా బ్రహ్మాండంగా చేసారిద్దరు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం డైరెక్టర్ తేజ కొన్ని వందలమందిని ఆడిషన్స్ కి పిలిచి,రీమాను సెలక్ట్ చేసుకున్నాడు. అయితే తేజ అంచనాల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా నటించి,అందరి దృష్టిలో పడింది. ఇక ఈమూవీలో రీమా సేన్ బోల్డ్ గా నటించి,విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈమె పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ నటించిన బంగారం మూవీలో రీమాసేన్ నటించింది.

ఆ సినిమాలో పవన్ ని దగ్గర నుంచి చూసి ఫిదా అయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన విషయం తెలుసుకుని చాలా సంతోషించిన రీమా,వచ్చే ఎన్నికల్లో పవన్ పిలిస్తే జనసేనకు ప్రచారం కూడా చేసి పెడతామని అంటోంది. 1981 అక్టోబర్ 29న జన్మించిన రీమా హైస్కూల్ చదువు కోల్ కత్తా లోని సెయింట్ థామస్ హైస్కూల్ లోనే పూర్తిచేసింది.

ఆ తర్వాత ఆమె కుటుంబం ముంబయి కి వలసవెళ్లింది. తేజ డైరెక్షన్ లో చిత్రం మూవీ ఎంపికై మంచి నటనను ప్రదర్శించిన రీమా అదే ఏడాది తమిళ చిత్రం మినాలి మూవీతో అదరగొట్టేసింది. బావ నచ్చదు,మనసంతా నువ్వే,వీడే చిత్రాలతో తెలుగు ప్రేక్షుకుల కు బాగా కనెక్ట్ అయింది. 2010లో వచ్చిన ముగ్గురు మూవీ ఈమె కు తెలుగు చివరి చిత్రం.

అలాగే 2012లో తమిళంలో వచ్చిన ‘ సత్తమౌరాయి రిత్తానా’ చిత్రం తర్వాత నటనకు గురు బై చెప్పేసి, అదే ఏడాది తన బాయ్ ఫ్రెండ్, ఢిల్లీ తదితర చోట్ల రెస్టారెంట్ రెస్టారెంట్ వ్యాపారంలో గల శివ కరణ్ సింగ్ ని పెళ్లాడింది. చాలా కాలం నుంచి ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో పెళ్ళికి ముందు చాలా వార్తలు వచ్చాయి.

వీరికి పుట్టిన బిడ్డకు రుద్ర వీర్ అని నాకమరణం చేసారు. ఇక ఇప్పుడు పవన్ పార్టీలో చేరి, ప్రచార కర్తగా ఉంటె తిరుగులేదు .