Devotional

నోటిలో నుంచి శివలింగాలు తీసే బాల సాయిబాబా ఇకలేరు!

కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రమంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

బాలసాయిబాబా 18 సంవత్సరాల వయసులోనే తొలిసారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కడుపులోంచి శివలింగం తీసే విద్య ద్వారా బాలసాయిబాబా ప్రాచుర్యం పొందారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు భౌతిక కాయాన్ని కర్నూలు తరలిస్తామని బాలసాయి బాబా అనుచరుడు తెలిపారు.