Movies

వ్యసనానికి బానిస అయి జీవితాన్ని నాశనం చేసుకున్న ఈ హీరో కూతురు టాప్ హీరోయిన్…ఎవరో చూడండి

సినీ ప్రపంచం మనిషిని ఆకాశానికి ఎత్తేస్తుంది. అదే స్థాయిలో కింద పడేస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా అయిపోతారో తెలియని పరిస్థితి. తెచ్చిన వైభవం,ప్రాభవం కోల్పోయి కొందరు చివరి అంకంలో అష్టకష్టాలు అనుభవించి మరీ తనువు చాలిస్తారు. ఇక సినీ పరిశ్రమ కొందరిని ఆగర్భ శ్రీమంతులుగా మార్చేస్తుంది. తరతరాలు కూర్చుని తిన్నా కరగని ఆస్తిని కూడబెట్టేలా చేస్తుంది. ఇక 9మంది పిల్లలకు కడుపునిండా భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో ప్రఖ్యాత హీరో అమరనాధ్ అద్దెంట్లో అద్దె కూడా కట్టలేని విధంగా తయారయ్యాడు. స్టార్ హీరోగా బంగ్లాలో ఉండాల్సిన నటుడి పరిస్థితి అలా దిగజారిపోయింది.

సీన్ కట్ చేస్తే,ఆ తొమ్మిది మంది పిల్లల్లో రెండవ సంతానం అయిన శ్రీలక్ష్మి చెన్నై పెట్టె చేతపట్టుకుని వెళ్లి , సినిమాల్లో నటిస్తూ,అరకొర సంపాదనలో కోట్నమొత్తాన్ని ఇంటికి పంపేది. ఇక తండ్రిని మించిన అందగాడైన ఆమె తమ్ముడు రాజేష్ అక్క సంపాదన తోడవ్వడంతో టిప్ టాప్ గా తయారవుతూ హీరో అవ్వాలని కలలు కనేవాడు. అలా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అక్క సిఫార్స్ తో రెండు జెళ్ళ సీత సినిమాలో నలుగురు హీరోల్లో ఒక హీరోగా సెలక్ట్ అయ్యాడు.

సినిమాలో బుక్ అవ్వడంతోనే మనల్ని మించినవాళ్లు లేరని రాజేష్ అనుకున్నాడు. మరోపక్క తండ్రి అమరనాధ్ కామెర్లు ముదిరి కాలం చేసాడు.
ఇక తండ్రి మరణంతో అందరినీ చెన్నైకి మార్పించి,కుటుంబంలో అందరినీ ఒక ఇంటివాళ్లుగా చేయడానికి శ్రీలక్ష్మి డబ్బు మిషన్ గా మారిపోయింది. ఇక బాలకృష్ణ,వెంకటేష్,నాగార్జున వంటి వాళ్ళతో సమానంగా చిన్న సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతున్న రాజేష్,ఏకంగా 54సినిమాలు చేసేసాడు. ఇక మంచిచెడు చెప్పే శ్రీలక్ష్మి పెళ్ళిచేసుకుని తన బతుకు తాను బతుకుతోంది.

ఇక రాజేష్ కి పెళ్ళికావడంతో ముత్యాల్లాంటి నలుగురు పిల్లలు కలిగారు. తాను ఒకటి తలిస్తే,దైవం ఒకటి తలిచినట్లు ఆసమయంలో మత్తుకి బానిసై,మత్తులో జోగేవాడు. ఇక ఓరోజు పీకలదాకా తాగి,కారు డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇక కొన్ని రోజులకు అతని నలుగురు సంతానంలో ఓ కుమారుడు ప్రమాదంలో మరణించగా,మరో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే గుండె ధైర్యంతో మిగిలిన ఇద్దరు పిల్లలను రాజేష్ భార్య తీర్చిదిద్దింది. కుమారుడు ఉన్నత చదువుతో సెటిల్ అవ్వగా, కూతురు ఐశ్వర్య తాతతండ్రుల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని పలు భాషల్లో హీరోయిన్ గా అడుగులు వేస్తోంది.