Politics

బ్రాహ్మణి – ఉపాసనల బంధం వెనుక అసలు రహస్యాలు

అందరి మధ్యా పోటీ ఉన్నట్లే సినిమా వాళ్ళ మధ్య కూడా విపరీతమైన పోటీ ఉంటుంది. ఇక అభిమాన హీరోలకు ఫాన్స్ మధ్య గొడవలు కూడా జరిగిపోతాయి. కానీ సదరు హీరోల మధ్య ఎంత పోటీ వున్నా సరే, మంచి ఫ్రెండ్స్ గా ఉండడం కొందరికే సాధ్యం. అలా మంచి ఫ్రెండ్స్ గా మెగాస్టార్ చిరంజీవి,యువరత్న బాలకృష్ణ మెలుగుతున్నారు. నాకున్న ఫ్రెండ్స్ లో మొదటి వరుసలో చిరంజీవి ఉంటాడని బాలయ్య అంటే, అదేరీతిలో చిరు కూడా చెబుతుంటాడు. ఇలా వీళ్లద్దరి మధ్యా బంధం వారసులకు, కుటుంబ సభ్యులకు కూడా పాకింది.

బాలయ్య కూతురు,నారా వారి కోడలు బ్రాహ్మణి, మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ నడుస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్ కి బ్రాహ్మణి ఎగ్జుక్యూటివ్ డైరెక్టర్ గా వుంటుంటే, , అపోలో ఫౌండేషన్ కి ఉపాసన వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తిగతంగా బలంగా ఎదుగుతూ సమాజంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఇక వీరిద్దరూ యంగ్ ప్రెసిడెంట్ సంస్థలో మెంబర్స్ గా ఉన్నారు. అందుకే ఇటీవల ఇద్దరూ ఈజిప్టు కి వెళ్లారు.

యంగ్ ప్రెసిడెంట్ సంస్థ లాభాపేక్ష లేకుండా నడిచే సంస్థ. ఇటీవల 85మందితో ఈజిప్టు ట్రిప్ వేసింది. అక్కడ బ్రాహ్మణి – ఉపాసన బాగా క్లోజ్ గా మూవీ అవుతూ పిరమిడ్స్ దగ్గర ఫోజులిచ్చారు. పలు చారిత్రాత్మక ప్రదేశాలను చూసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఫోటోలను పంచుకుంటూ కొన్ని విషయాలను పోస్ట్ చేసింది. వీరిద్దరూ కల్సిన ఫోటో వైరల్ అయింది. నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ‘మూడు రోజులపాటు ఈజిప్టు ట్రిప్ లో ఉన్నాం. ఎన్నో చారిత్రాత్మక ప్లేస్ లు చూసాం. నిజంగా మరిచిపోలేని ట్రిప్ ఇది’అని ఉపాసన పేర్కొంది.