Movies

అవును సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అవును మూవీ,ఆ తర్వాత అవును – 2మూవీలో కూడా నటించి విమర్సల ప్రశంసలు అందుకున్న స్టార్ హీరోయిన్ పూర్ణ ఇప్పుడు మరింతగా చిక్కింది. చూసిన వాళ్ళు ఈమె ఇలా అయిపోయిందా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ఓ ఇంటర్యూలో చెప్పింది. కేరళ ముస్లిం కుటుంబానికి చెందిన పూర్ణ అసలు పేరు షామ్ నా ఖాసీం. ఈమె మంచి డాన్సర్. ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చి అలరించిన ఈమె డాన్స్ ద్వారానే సినీ ఛాన్స్ లు అందిపుచ్చుకుంది. ఈమెకు భరతనాట్యం అంటే ఎంతోమక్కువ. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు పూర్ణగా పేరు మార్చుకుంది. ఇక ఈమె ఓ డాన్స్ స్కూల్ కూడా పెట్టాలన్న యోచనలో ఉందట.

ఈమె సినీ ప్రవేశం ఎలా జరిగిందంటే, సూపర్ డాన్సర్ నృత్య పోటీల్లో పాల్గొన్న ఈమె మీడియా కంటపడింది. అలా మంజూపులోరు పెంకుట్టి అనే మళయాళ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. మరో రెండు మూడు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించిన పూర్ణకు అవి ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు. శ్రీహరి హీరోగా నటించిన మహాలక్ష్మి మూవీలో నటించడం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో దెయ్యం పాత్రల్లో ఎక్కువగా నటించడం వలన ‘ది గోస్ట్ క్వీన్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్’అని ది హిందూ పత్రిక పేర్కొంది.

అవును సినిమా తరవాత అలాంటి సినిమాల్లోనే నటించాలని ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్స్ వచ్చినా,ఆమె సున్నితంగా తిరస్కరించింది.అయితే 2015లో వచ్చిన రాజు గారి గది మూవీలో కూడా పూర్ణ దెయ్యం రోల్ వేసి, మంచి పేరు తెచ్చుకుంది. అయితే బొద్దుగా ఉండే పూర్ణ ఒక్కసారిగా చిక్కిపోయి మెరుపు తీగలా మారడంతో చూసిన వాళ్ళు షాక్ తింటున్నారు. హీరోయిన్ మాత్రమే కాకుండా పాత్ర బాగుంటే ఏది చేసినా పర్వాలేదని అనడంతో ఈమెకు మంచి ఛాన్స్ లు వస్తున్నాయి.

విశాల్ హీరోగా తమిళ్ మూవీలో నటిస్తున్న పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా మాస్ కేరక్టర్ లో కనిపించబోతోందట. ఈసినిమా కోసం పూర్ణ గుండు కొట్టించుకుంది. బ్లూ వేల్ అనే మరో మూవీలో నటిస్తోంది. మళయాళంలో ముమ్ముట్టి తో ఓ సినిమా అలాగే తెలుగులో మరో సినిమా చేస్తోంది.