Movies

‘నా పేరు మీనాక్షి’ సీరియల్ హీరో టాలీవుడ్ లో ఏ సినిమాలు చేసాడో తెలుసా?

బుల్లితెర మీద వస్తున్న సీరియల్స్ లో కొన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. కొన్ని చెత్తగా ఉన్నా,మరికొన్ని పర్వాలేదు అన్నట్లు ఉంటున్నాయి. ఇక బాగా క్లిక్ అయిన సీరియల్ గురించి చెప్పాలంటే అందులో ప్రధానంగా ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ గురించే చెప్పాలి. ఇందులో హీరోగా వేసున్న మధు బుల్లితెర మీద తన సత్తా చాటుతున్నాడు. అయితే మధు అంటే కొందరికి తెలియకపోవచ్చు. కానీ క్రిష్ అంటే అందరికీ తెలుస్తుంది. చూడ్డానికి అందంగా ఉండే మధుకి అమ్మాయిలు ఫిదా అవుతారు. మొదటి సీరియల్ తోనే సినీ హీరో అంతటి స్టార్ డమ్ ని, ఇమేజ్ ని సొంతం చేసుకున్న మధు నిజానికి సినిమాల్లో నిలబడలేక వెండితెర వదిలేసి బుల్లితెరమీదికి వచ్చాడు.

కర్ణాటకు చెందిన మధు తెలుగు వాడు కాకున్నా తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులకు తన నటనతో బాగా దగ్గరయ్యాడు. గోరంత దీపం సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన మధు,ఆతర్వాత ముత్యాల ముగ్గు వంటి సీరియల్స్ లో నటించాడు. ముఖ్యంగా ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు. ఆ సీరియల్ లోని క్రిష్ కేరక్టర్ ఛానల్ టిఆర్పి రేటింగ్ ని అమాంతం పెంచేసింది. దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సీరియల్ లో చేసిన నటనకు బెస్ట్ హీరో అవార్డు కూడా అందుకున్నాడు. నిజానికి యితడు టివి రంగంలోకి రాకముందు సినిమాల్లో, పైగా హీరోగా నటించాడు.

ఒకటో రెండో సినిమాలు కాదు ఏకంగా ఆరు సినిమాల్లో నటించిన మధు,తెలుగులో పాట మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో మూడు,కన్నడంలో మూడు యాక్ట్ చేసాడు. పాట మూవీ ప్లాప్ అవ్వడంతో మిగిలిన రెండు తెలుగు సినిమాలు ఆడలేదు. అయితే కన్నడలో అస్తిత్వ మూవీతో ఎంట్రీ ఇవ్వగా మంచి పేరు వచ్చింది. కొన్ని సినిమాలు ఆడకపోవడం,కొన్ని విడుదల కాకపోవడంతో సినీ రంగాన్ని వదిలేసాడు. సినిమా అచ్చిరాదని భావించి రెండేళ్లు ఉద్యోగం కూడా చేసిన మధు ఆతర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి దుమ్ము రేపుతున్నాడు. ఇక తాజాగా డబ్య్లు డబ్య్లు డాట్ కామ్ మీనా బజార్ డాట్ కామ్ అనే సినిమాలో ఏకంగా కన్నడ ,తెలుగు భాషల్లో నటిస్తున్నాడు.