Movies

ప్రభాస్ సాహు లో కీలక సన్నివేశం ఇదే…సినిమాకే హైలెట్

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం సాహు. ఈ మూవీకి సుజిత్ డైరెక్షన్ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ మూవీ తీస్తున్నారట. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. శంకర్ ఎస్ ఆన్ లై సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ ముఖేష్,అరుణ్ విజయ్ కీలకమైన రోల్స్ వేస్తున్నారు. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన మేకింగ్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలు గల ఈ మూవీలో ఓ కీలక సన్నివేశం హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
Sahoo Prabhas
నిజమో కాదో కానీ ఒకటి రెండు సోషల్ మీడియా ఛానల్స్ లో వచ్చిన కథనాలపై ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ దొంగతనం చేసే సీన్ ఉందట. ఓ బంగారం దుకాణంలో దొంగతనం చేయడానికి ప్రభాస్ భారీ స్కెచ్ వేయడం, అది అమల్లో పెట్టి నగలు కొట్టేయడం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సీన్ లో హీరోయినా శ్రద్ధా కపూర్ కూడా ఉంటుందట. ఇక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కూడా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శ్రద్ధ తో వర్క్ చేస్తున్నాడట.

కాగా దాదాపు 200కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూరప్ లో కొన్ని సీన్స్ తీయాలని అనుకున్నా, ఫిలిం సిటీలో సెట్ వేసి చేసేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని 2019ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. దేశవిదేశాల్లో చిత్రిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ ,హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.