భార్య నమ్రత పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని జోడీలకు భలే క్రేజ్ ఉంటుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిర్కోద్కర్ జంటకు గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదర్శ దంపతులు అంటే ఎలా ఉంటారో వీళ్లను చూస్తే అర్థమవుతుందంటూ ఫాన్స్ సంబరాలు చేసుకుంటారు. పెళ్లై 14 ఏళ్లైపోయినా ఇప్పటి వరకు చిన్న గొడవ గానీ, ఎలాంటి వివాదాల జోలికి గానీ పోకుండా హాయిగా ఉన్నారు. ఇక బిజీ ఆర్టిస్టుగా ఉన్న మహేష్ బాబు నెల రోజులుగా టూర్ ఎంజాయ్ చేసి,. ఈ మధ్యే ఇండియాకు వచ్చాడు. జులై 5 నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీ కానున్నాడు.
ఈ మూవీలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు . రష్మిక మందన్న హీరోయిన్ కాగా, విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా తన భార్య నమ్రత గురించి మనసులో మాట బయటికి చెప్పేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆమె లేకుండా నేను లేనని.. అసలు నమ్రత లేకుండా తనకేం పని చేతకాదని ఒప్పుకున్నాడు.
తాను ఈ రోజు ఇంత హాయిగా ఉన్నానంటే.. ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమాలు చేసుకుంటున్నానంటే దానికి కారణం భార్యే అని మహేష్ బాబు అంటున్నాడు. తన టెన్షన్స్ అన్నీ ఆమె తీసుకుంటుందని, ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుందని చెప్పాడు. సినిమాల విషయం, యాడ్స్ విషయం, వ్యక్తిగత జీవితం ఇలా అన్నింట్లోనూ నమ్రత పాత్ర కీలకమే అంటున్నాడు. తన చెంతకు ఎలాంటి టెన్షన్స్ రాకుండా ప్రశాంతంగా ఉండటానికి తన కుటుంబమే కారణం అని మహేష్ చెప్పుకొచ్చాడు.